Ladakh: 3.9 తీవ్రతతో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
లడాఖ్లోని లేహ్ నగర సమీపంలో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) వెల్లడించింది. భూకంపం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో నమోదైందని అధికారులు తెలిపారు. ఎన్సీఎస్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఈ భూకంప కేంద్ర బిందువు అక్షాంశం 36.692 ఉత్తరం, రేఖాంశం 74.382 తూర్పు వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
భూకంపాల లోతుల వర్గీకరణ ఏమిటి?
భూమి ఉపరితలం నుంచి సుమారు 700 కిలోమీటర్ల లోతు వరకు భూకంపాలు సంభవించవచ్చు. యూఎస్జీఎస్ ప్రకారం భూకంపాలను లోతు ఆధారంగా మూడు రకాలుగా విభజిస్తారు. తక్కువ లోతు (Shallow Earthquakes) : 0 నుంచి 70 కిలోమీటర్ల లోతులో సంభవిస్తాయి. ఇవే ఎక్కువగా నష్టం కలిగించే భూకంపాలు. మధ్యస్థ లోతు (Intermediate Earthquakes) : 70 నుంచి 300 కిలోమీటర్ల మధ్య సంభవిస్తాయి. అధిక లోతు (Deep Earthquakes) : 300 నుంచి 700 కిలోమీటర్ల లోతులో సంభవిస్తాయి. ఈ వర్గీకరణ భూకంపాల స్వభావం, ప్రభావం అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు సాయపడుతుంది.