LOADING...
Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి.. రిపోర్టులో విస్తుపోయే నిజాలు!
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి.. రిపోర్టులో విస్తుపోయే నిజాలు!

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి.. రిపోర్టులో విస్తుపోయే నిజాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2025
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు కరూర్‌ జిల్లాలో శనివారం జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి. నిర్లక్ష్యం వల్లే 41 మంది ప్రాణాలు పోయాయని తాజా రిపోర్టులు స్పష్టం చేశాయి.

Details

ఆలస్యం.. పెరిగిన జనసంద్రం

ఈ ఘటనకు కారణాలు గంటల కొద్ది వేచి ఉండటమేనని తెలుస్తోంది. నటుడు విజయ్‌ మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్య సభాస్థలానికి రానున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన సాయంత్రం 7 గంటలకు మాత్రమే చేరుకున్నారు. ఇంతలో వేదిక వద్ద జనసందోహం పెరిగిపోయింది. శనివారం కావడంతో కుటుంబాలతో పాటు మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టెక్స్టైల్‌, దోమతెర పరిశ్రమ కార్మికులు కూడా వేతనదినం కావడంతో పెద్దఎత్తున హాజరయ్యారు.

Details

సభా స్థల ఎంపిక కూడా తప్పే 

సభాస్థల ఎంపిక కూడా పరిస్థితిని మరింత కఠినతరం చేసింది. మొదట 10 వేలమంది సర్దుకునే ప్రదేశానికి అనుమతి కోరగా, పోలీసులు కరూర్‌ వెలుసామీపురంలోని వేదికను సూచించారు. కానీ సభకు చేరిన జనసందోహం 50 వేలమంది వరకు పెరిగింది. బయటకు వెళ్లే మార్గాలు ఇరుగ్గా ఉండగా, ఇక ఈ వేదిక అత్యవసర పరిస్థితుల్లో ఖాళీ చేయడం అసాధ్యమైంది. స్థానికులు దీన్ని అత్యంత ప్రమాదకరమని వివరించారు. అయితే ADGP డేవిడ్‌సన్ దేవసిర్వతం మాత్రం ఈ వేదికలో ఇటీవలే జరిగిన AIADMK సభలో ఎలాంటి సమస్యలూ రాలేదని, టీవీకే మాత్రం వేదిక మార్పుపై సహకరించలేదని పేర్కొన్నారు.

Details

విద్యుత్ సరఫరా నిలిపివేత

నమక్కల్‌ నుంచి విజయ్‌ కాన్వాయ్‌ రాగానే పరిస్థితి అదుపు తప్పింది. ప్రత్యేక ప్రాంగణం లేకపోవడంతో వాహనం నేరుగా జనసందోహం మధ్యలో ప్రవేశించింది. రహదారి ఇరువైపులా నిలిచినవారు జనాల మధ్యలో చిక్కుకుపోయారు. ఇదే సమయంలో విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో చీకటి కమ్మేసింది. మరోవైపు ఓ చెట్టు కొమ్మ విరిగి పడటంతో సంఘటన మరింత కలవరం రేపింది. ఆఖరి క్షణాలు సాయంత్రం 7 నుంచి 7.30 మధ్యలో తొక్కిసలాట జరిగింది. చీకటిలో ప్రజలు ఎటు పడితే అటు పరుగులు తీశారు. ఇదే సమయంలో సభా వేదికపై పాటలు గట్టిగా వినిపిస్తూనే ఉన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, అనేకమంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు