NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ration Cards: 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల తొలగింపు: ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    Ration Cards: 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల తొలగింపు: ప్రభుత్వం
    5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల తొలగింపు: ప్రభుత్వం

    Ration Cards: 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల తొలగింపు: ప్రభుత్వం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 20, 2024
    04:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డిజిటైజేషన్ కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, ఆవిధంగా ఆహార భద్రతలో ప్రపంచానికి ఒక నూతన ప్రమాణాన్ని స్థాపించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

    ఈ వ్యవస్థ ద్వారా మొత్తం 80.6 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతుండగా, ఆధార్ ధ్రువీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్‌ల ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులు తొలగించబడినట్లు పేర్కొంది.

    కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం,ఇప్పటివరకు 20.4 కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తయింది.

    దేశవ్యాప్తంగా 5.33 లక్షల చౌకధరల దుకాణాల్లో ఈపోస్ పరికరాలు అమర్చబడ్డాయి.

    వీటి సహాయంతో 99.8% కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయగా, 98.7% లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తయింది. ఈకేవైసీ ప్రక్రియ ద్వారా 64% లబ్ధిదారుల వెరిఫికేషన్ కూడా పూర్తయింది.

    వివరాలు 

    ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పటిష్ట చర్యలు

    ఆహార సరఫరాలో పకడ్బందీగా వ్యవహరించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) పటిష్ట చర్యలు తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

    సరకు రవాణాను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు రైల్వేల ద్వారా వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అనుసంధానించామని వివరించింది.

    అలాగే, వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకం ద్వారా లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా సరకులు పొందగలిగే సౌలభ్యాన్ని పొందారని వివరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    కేంద్ర ప్రభుత్వం

    Centre to Slash Fuel Rates: వాహనదారులకు అలెర్ట్..త్వరలోనే తగనున్న ఇంధన ధరలు..కేంద్రం కీలక ప్రకటన  బిజినెస్
    AP-Telangana:తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం  భారతదేశం
    AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...! ఆంధ్రప్రదేశ్
    Adhaar-style IDs: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అక్టోబరు నుంచి ఆధార్ తరహా ఐడీల నమోదు ప్రారంభం బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025