Loading...
Parliament Chaos: పార్లమెంట్‌లో నిరసనలతో 7,023 నిమిషాలు వృథా.. ఖర్చు రూ.175 కోట్లు
పార్లమెంట్‌లో నిరసనలతో 7,023 నిమిషాలు వృథా.. ఖర్చు రూ.175 కోట్లు

Parliament Chaos: పార్లమెంట్‌లో నిరసనలతో 7,023 నిమిషాలు వృథా.. ఖర్చు రూ.175 కోట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుస నిరసనలు, ఆందోళనలు, సభలో గందరగోళం మధ్య సాగాయి. ఈ సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభ కలిసి 20 బిల్లులను ఆమోదించినప్పటికీ.. చాలాసార్లు నిరసనలు, నినాదాలు, విపక్షాల వాకౌట్ల మధ్యే సభా కార్యక్రమాలు కొనసాగాయి. దీంతో పార్లమెంట్‌లో ఎంత సమయం వృథా అయిందన్న అంశంపై చర్చ మొదలైంది. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం.. ఈ సమావేశాల్లో పార్లమెంట్ మొత్తం 7,023 నిమిషాల పని సమయాన్ని కోల్పోయింది. లోక్‌సభ ఒక్క నిమిషం పనిచేయడానికి సుమారు రూ.2.5 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన అంతరాయాల కారణంగా వృథా అయిన సమయానికి దాదాపు రూ.175 కోట్ల ప్రజాధనం ఖర్చైనట్లు అంచనా వేస్తున్నారు. అయితే సభా సమయం వృథా కావడం ఇదే తొలిసారి కాదు.

వివరాలు 

బోఫోర్స్ నుంచి మణిపూర్ వరకు..

గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ వివాదాలు,విపక్షాల నిరసనల కారణంగా పార్లమెంట్ సమావేశాలు పలుమార్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

కొన్ని సందర్భాల్లో కీలకమైన శాసన కార్యక్రమాలు తగ్గిపోగా.. మరికొన్ని సందర్భాల్లో సభ పూర్తిగా స్తంభించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

1980లలో జరిగిన బోఫోర్స్ వివాదం పార్లమెంట్ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసిన తొలి ప్రధాన ఘటనల్లో ఒకటి.

అప్పట్లో విపక్షాలు వరుసగా నిరసనలు చేపట్టడంతో సభా కార్యక్రమాలు పలుమార్లు నిలిచిపోయాయి.

2010 శీతాకాల సమావేశాల్లో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల వివాదం ప్రధాన అంశంగా మారింది.

ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

దీంతో అనేక రోజుల పాటు సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితంగా శాసన కార్యక్రమాలు పరిమితమయ్యాయి.

వివరాలు 

బోఫోర్స్ నుంచి మణిపూర్ వరకు..

2012 వర్షాకాల సమావేశాలు కూడా కామన్వెల్త్ క్రీడల నిర్వహణ,లోక్‌పాల్ బిల్లు అంశాలపై జరిగిన నిరసనలతో ప్రభావితమయ్యాయి.

ఆ సమయంలో లోక్‌సభకు కేటాయించిన 60 గంటల్లో కేవలం 23 గంటలు మాత్రమే సభా కార్యకలాపాలు జరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

2015 వర్షాకాల సమావేశాల్లో వ్యాపమ్ వ్యవహారం, అప్పటి ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీకి సంబంధించిన అంశాలు సభను కుదిపేశాయి.

విపక్షాల నిరసనల కారణంగా షెడ్యూల్ చేసిన పార్లమెంటరీ పనుల్లో సుమారు 46 శాతం మాత్రమే పూర్తయింది.

2016 శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై విపక్షాలు తీవ్ర ఆందోళనలు చేపట్టాయి.

దీంతో ఆ సమావేశాల్లో లోక్‌సభకు సంబంధించిన సుమారు 92 గంటల పని సమయం వృథా అయినట్లు నివేదికలు వెల్లడించాయి.

ADVERTISEMENT

వివరాలు 

బోఫోర్స్ నుంచి మణిపూర్ వరకు..

2018 బడ్జెట్ సమావేశాల రెండో భాగంలో బ్యాంకింగ్ కుంభకోణాలు, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వంటి అంశాలపై నిరసనలు జరిగాయి.

దీంతో సభలో జరగాల్సిన కీలక కార్యక్రమాలు పూర్తిస్థాయిలో సాగలేదు. అదే ఏడాది జరిగిన వర్షాకాల సమావేశాల్లో రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

నిరసనలు జరిగిన సమయంలో షెడ్యూల్ చేసిన పార్లమెంటరీ కార్యకలాపాల్లో కేవలం 15 శాతం మాత్రమే పూర్తయినట్లు సమాచారం.

ఇటీవల 2023 వర్షాకాల సమావేశాలు కూడా మణిపుర్‌లో జరిగిన హింసాకాండ అంశంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ADVERTISEMENT

వివరాలు 

బోఫోర్స్ నుంచి మణిపూర్ వరకు..

మణిపూర్ పరిస్థితిపై చర్చకు అవకాశం ఇవ్వాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో సభా కార్యకలాపాలు పలుమార్లు నిలిచిపోయాయి.

ఈ పరిణామాలు చూస్తే.. పార్లమెంట్‌లో నిరసనలు, రాజకీయ ఆందోళనలు కొత్తేమీ కాదని స్పష్టమవుతోంది.

అయితే ప్రతి అంతరాయం వల్ల విలువైన సభా సమయంతో పాటు ప్రజాధనం కూడా వృథా అవుతుండటం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT