ఉజ్వల స్కీమ్ కింద 75 లక్షల కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద మహిళలకు ఎల్పీజీ కనెక్షన్ల కోసం గ్రాంట్ విడుదల పథకానికి కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను మూడేళ్లలో ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉజ్వల పథకం కింద 9.60 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చినట్లు, ఇప్పుడు మరో 75 లక్షల ఉచిత కనెక్షన్లు ఇస్తామని ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. దీని ద్వారా అనేక మంది పేదలు, మహిళలు ప్రయోజనం కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం బుధవారం జరగ్గా, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు.
ఈ-కోర్టుల ప్రాజెక్ట్ ఫేజ్-IIIకు కేంద్రం ఆమోదం
ఉజ్వల పథకం కింద అదనంగా 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను ఇవ్వడం ద్వారా.. ఈ పథకం కింద మొత్తం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు పెరుగుతుంది. అలాగే 7,210 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో నాలుగేళ్లలో పూర్తి చేసేలా ఈ-కోర్టుల ప్రాజెక్ట్ ఫేజ్-IIIకు కూడా కేంద్రం ఆమోదం తెలిపినట్లు అనురాగ్ ఠాగూర్ చెప్పారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో న్యూదిల్లీలో జరిగిన జి20 సమ్మిట్ విజయవంతమైనందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సైప్రస్కు చెందిన బెర్హండా లిమిటెడ్ సువెన్ ఫార్మాస్యూటికల్స్లో రూ.9,589 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.