Page Loader
Maharashtra: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం
Maharashtra: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం

Maharashtra: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం

వ్రాసిన వారు Stalin
Dec 31, 2023
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

Maharashtra fire accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఛత్రపతి శంభాజీనగర్‌లోని గ్లోవ్స్ తయారీ కర్మాగారంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 6 మంది మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులను రక్షించారు. మంటల్లో చిక్కుకుని గాయాలపాలైన కార్మికులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణాలు మరింత పెరింగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాత్రి 2గంటల సమయంలో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయని ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు తెలిపారు. ఆ సమయంలో 10-15 మంది కార్మికులు లోపల నిద్రిస్తున్నారు. ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు రావడంతో కొంతమంది బయటకు రాగలిగారని, అయితే 5-6 మంది లోపలే చిక్కుకున్నారని తోటి కార్మికులు చెప్పారు.

మహారాష్ట్ర

మృతులను గుర్తించని అధికారులు

అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ ముంగ్సే మాట్లాడుతూ.. 2:15 గంటలకు మంటల గురించి తమకు సమాచారం అందిందని, తాము సంఘటనా స్థలానికి చేరుకునేసరికి మంటలు మొత్తం ఫ్యాక్టరీకి వ్యాపించాయన్నారు. ఇప్పటి వరకు 6 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అయితే మరణించిన కార్మికులను ఇంకా గుర్తించలేదన్నారు. ఈ ఫ్యాక్టరీ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MIDC)లోని వాలూజ్ ప్రాంతంలో ఉంది. నవంబర్‌లో మహారాష్ట్రలోని రాయ్‌ఘర్‌లో ఉన్న ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన తరువాత జరిగిన అగ్నిప్రమాదంలో 7 మంది మరణించారు. అనేక మంది ఉద్యోగులు కూడా గాయపడ్డారు.