NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    Maharashtra: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం
    Maharashtra: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం

    Maharashtra: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం

    వ్రాసిన వారు Stalin
    Dec 31, 2023
    09:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    Maharashtra fire accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఛత్రపతి శంభాజీనగర్‌లోని గ్లోవ్స్ తయారీ కర్మాగారంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 6 మంది మరణించారు.

    ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులను రక్షించారు.

    మంటల్లో చిక్కుకుని గాయాలపాలైన కార్మికులను సమీప ఆసుపత్రికి తరలించారు.

    ఈ ప్రమాదంలో మరణాలు మరింత పెరింగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

    రాత్రి 2గంటల సమయంలో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయని ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు తెలిపారు.

    ఆ సమయంలో 10-15 మంది కార్మికులు లోపల నిద్రిస్తున్నారు. ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు రావడంతో కొంతమంది బయటకు రాగలిగారని, అయితే 5-6 మంది లోపలే చిక్కుకున్నారని తోటి కార్మికులు చెప్పారు.

    మహారాష్ట్ర

    మృతులను గుర్తించని అధికారులు

    అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ ముంగ్సే మాట్లాడుతూ.. 2:15 గంటలకు మంటల గురించి తమకు సమాచారం అందిందని, తాము సంఘటనా స్థలానికి చేరుకునేసరికి మంటలు మొత్తం ఫ్యాక్టరీకి వ్యాపించాయన్నారు.

    ఇప్పటి వరకు 6 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అయితే మరణించిన కార్మికులను ఇంకా గుర్తించలేదన్నారు.

    ఈ ఫ్యాక్టరీ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MIDC)లోని వాలూజ్ ప్రాంతంలో ఉంది.

    నవంబర్‌లో మహారాష్ట్రలోని రాయ్‌ఘర్‌లో ఉన్న ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన తరువాత జరిగిన అగ్నిప్రమాదంలో 7 మంది మరణించారు. అనేక మంది ఉద్యోగులు కూడా గాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    అగ్నిప్రమాదం
    తాజా వార్తలు

    తాజా

    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా

    మహారాష్ట్ర

    రన్నింగ్ ట్రైన్‌లో ఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు; నలుగురు మృతి తుపాకీ కాల్పులు
    PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు  నరేంద్ర మోదీ
    Maharashtra: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం; 17మంది కార్మికులు మృతి  తాజా వార్తలు
    లోకల్ ట్రైన్‌‌లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్ ముంబై

    అగ్నిప్రమాదం

    ఉత్తర్‌ప్రదేశ్: ఆక్రమణల తొలగింపు సమయంలో ఇంటికి నిప్పు! తల్లీ, కూతురు సజీవ దహనం ఉత్తర్‌ప్రదేశ్
    తెలంగాణ: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం; ఆరుగురు మృతి సికింద్రాబాద్
    బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం తమిళనాడు
    బద్దలైన అగ్నిపర్వతం; గ్రామాలను కప్పేసిన బూడిద; ఎగిసిపడుతున్న లావా  రష్యా

    తాజా వార్తలు

    Arabian Sea: దాడులను ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో 3 యుద్ధనౌకలను మోహరించిన భారత్ అరేబియా సముద్రం
    BSF: 2023లో పాకిస్థాన్ సరిహద్దులో 100 డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్ఎఫ్ పాకిస్థాన్
    AP Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో సమ్మెకు దిగిన వాలంటీర్లు  ఆంధ్రప్రదేశ్
    Covid-19 cases: కొత్తగా 116మందికి కరోనా.. ముగ్గురు మృతి  కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025