NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 15గంటల్లో 286 మెట్రో స్టేషన్లలో ప్రయాణం; దిల్లీ వ్యక్తి గిన్నిస్ రికార్డు
    తదుపరి వార్తా కథనం
    15గంటల్లో 286 మెట్రో స్టేషన్లలో ప్రయాణం; దిల్లీ వ్యక్తి గిన్నిస్ రికార్డు
    15గంటల్లో 286 మెట్రో స్టేషన్లలో ప్రయాణం; దిల్లీ వ్యక్తి గిన్నిస్ రికార్డు

    15గంటల్లో 286 మెట్రో స్టేషన్లలో ప్రయాణం; దిల్లీ వ్యక్తి గిన్నిస్ రికార్డు

    వ్రాసిన వారు Stalin
    Jun 25, 2023
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేవలం 15గంటల్లోనే దిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణించి ఓ వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.

    దిల్లీకి చెందిన శశాంక్ మను అనే వ్యక్తి దిల్లీలోని మొత్తం 286మెట్రో స్టేషన్లను కేవలం 15గంటల 22నిమిషాల 49 సెకన్లలో ప్రయాణించినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.

    వాస్తవానికి మను ఏప్రిల్ 2021లో ఈ ఫీట్‌ని సాధించాడు. అయితే రెండేళ్ల తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అతనికి సర్టిఫికేట్ అందజేసింది. శశాంక్ మను ఒక ఫ్రీలాన్స్ పరిశోధకుడిగా, యాత్రికుడిగా ఉన్నారు.

    2021లోనే మనుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చొటు దక్కాల్సింది. కమ్యూనికేషన్ సమస్య వల్ల 16గంటల రెండు నిమిషాల సమయంలో అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రఫుల్ సింగ్‌కు అవార్డును అందుకున్నారు.

    దిల్లీ

    ప్రతి స్టేషన్‌లో వీడియో తీసిన శశాంక్ మను 

    తనకు జరిగిన అన్యాయాన్ని గురించి తెలుసుకున్న శశాంక్ మను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులను సంప్రదించే ప్రయత్నం చేశాడు. ఇందుకోసం అతనికి నెలల సమయం పట్టింది.

    ఎట్టకేలకు గిన్నిస్ నిర్వాహకులను కలిసిన తర్వాత తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు.

    తాను 15 గంటల్లోనే అన్ని మెట్రో స్టేషన్లను చుట్టొచ్చానని, కానీ ప్రఫుల్ సింగ్‌కు 16గంటల సమయం పట్టిందని మను పేర్కొన్నారు.

    రైలు తలుపులు తెరిచే, మూసివేసే సమయాలతో సహా మొత్తం పర్యటన అన్‌కట్ వీడియోను కూడా మను తీశారు.

    ఏప్రిల్ 14న ఉదయం 5:00 గంటలకు బ్లూ లైన్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన మను, బ్రిగేడియర్ హోషియార్ సింగ్ మెట్రో స్టేషన్ వద్ద గ్రీన్ లైన్‌లో రాత్రి 8:30 గంటలకు ముగించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
    దిల్లీ
    మెట్రో స్టేషన్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

    పంది మాంసంతో 17అడుగుల టర్కీ బేకన్ తయారు చేసిన లెబనాన్ కంపెనీ: గిన్నిస్ రికార్డ్స్ లో చోటు  లైఫ్-స్టైల్

    దిల్లీ

    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి? నరేంద్ర మోదీ
    రేపు రెజ్లర్లకు మద్దతుగా యూపీలో రైతు నాయకుల సమావేశం  రెజ్లింగ్
    ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    మెట్రో స్టేషన్

    దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి  కేరళ
    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!  కేరళ
    Hyderabad Metro: ఆ రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను నడుపుతున్న హైదరాబాద్ మెట్రో  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025