NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Swati Maliwal: ఢిల్లీ సీఎం హౌస్‌లో స్వాతి మలివాల్ పై దాడి ? .. దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు 
    తదుపరి వార్తా కథనం
    Swati Maliwal: ఢిల్లీ సీఎం హౌస్‌లో స్వాతి మలివాల్ పై దాడి ? .. దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు 
    ఢిల్లీ సీఎం హౌస్‌లో స్వాతి మలివాల్ పై దాడి ? .. దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు

    Swati Maliwal: ఢిల్లీ సీఎం హౌస్‌లో స్వాతి మలివాల్ పై దాడి ? .. దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు 

    వ్రాసిన వారు Stalin
    May 13, 2024
    12:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారని ఢిల్లీ పోలీసులకు సంబంధించిన వర్గాలు పేర్కొన్నాయి.

    సీఎం అరవింద్ కేజ్రీవాల్ హౌస్‌ నుంచి ఢిల్లీ పోలీసులకు పీసీఆర్‌ కాల్‌ వచ్చిందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఫోన్ చేసిన వ్యక్తి తనను స్వాతి మలివాల్ అని పరిచయం చేసుకుంది.

    ఢిల్లీ సీఎం నివాసం నుంచి సోమవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ పోలీసులకు రెండు పీసీఆర్ కాల్స్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

    అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా స్వాతి మలివాల్ కనిపించలేదు. ప్రొటోకాల్ ప్రకారం ఢిల్లీ పోలీసులు సీఎం హౌస్‌లోకి వెళ్లకూడదు.

    పీసీఆర్ కాల్‌లో నిజమెంతో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

    Details 

    ఆప్ పై ధ్వజమెత్తిన బీజేపీ 

    ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం..ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పీఏ తనపై సోమవారం దాడి చేశారని రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న స్వాలి మలివాల్ ఆరోపించారు.

    కేజ్రీవాల్ నివాసంలో సీఎం పీఏ విభవ్ కుమార్ కొట్టారని ఢిల్లీ మహిళా కమిషర్ మాజీ చైర్‌పర్సన్ ఆరోపించారు.

    అయితే ఈ విషయమై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందలేదు.దీనిపై స్వాతి మలివాల్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు.

    మలివాల్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసుల ఈ వాదనల తర్వాత, బీజేపీ కూడా స్పందించింది.

    మలివాల్‌పై దాడి ఆరోపణపై ఆప్‌పై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ధ్వజమెత్తారు.

    ఈ విషయమై పార్టీ అధినేత కేజ్రీవాల్ ఎందుకు మౌనం వహించారని అన్నారు.బీజేపీ నేత అమిత్ మాల్వియా ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత! విశాఖపట్టణం
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ తెలంగాణ
    Motivational Story: ఎదుటివారిలో తప్పులు వెతకడం మొదలు పెడితే.. ఒంటరిగా మిగిలిపోతారు! జీవనశైలి
    Tata Harrier EV: హారియర్ EV అడ్వెంచర్‌ ఫీచర్లలో బెస్ట్.. రూ.21.49 లక్షలకే సూపర్ ఎస్‌యూవీ!  టాటా మోటార్స్

    దిల్లీ

    Farmers protest: 'దిల్లీ మార్చ్' ఫిబ్రవరి 29కి వాయిదా.. నేడు సరిహద్దులో కొవ్వొత్తల ర్యాలీ హర్యానా
    Delhi: వీధి కుక్కుల దాడిలో రెండేళ్ల బాలిక మృతి  తాజా వార్తలు
    Delhi: బాడీ బిల్డింగ్‌ కోసం ఏకంగా భారీ సంఖ్యలో కాయిన్లు,మ్యాగ్నెట్‌లు మింగేశాడు భారతదేశం
    Arvind Kejriwal: 8వ సారి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు పంపిన ఈడీ  అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025