Goa beach: గోవా బీచ్లో ప్రమాదం.. సముద్రంలో పడిపోయిన పర్యాటకుడు (వీడియో)
ఈ వార్తాకథనం ఏంటి
గోవాలోని బాగా బీచ్లో సోమవారం ఓ ప్రమాదం తృటిలో తప్పింది. పారాసైలింగ్ చేస్తుండగా మధ్యలో కేబుల్ తెగిపోవడంతో ఒక పర్యాటకుడు గాల్లో నుంచి సముద్రంలో పడిపోయాడు. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన బోటు సిబ్బంది అతడిని సురక్షితంగా కాపాడడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై గోవా పోలీసులు దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటనతో దేశంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. 2025 అక్టోబర్లో ఉత్తరాఖండ్లోని తెహ్రీ సరస్సు వద్ద శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుండగా రిషి అనే ట్రైనీ ప్యారాగ్లైడింగ్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి సరస్సులో పడిపోయాడు.
వివరాలు
సురక్షితంగా రక్షించిన సిబ్బంది
అదృష్టవశాత్తు అతడిని కూడా సురక్షితంగా రక్షించారు. అలాగే గతేడాది హిమాచల్ ప్రదేశ్లోని ఇంద్రునాగ్లో అహ్మదాబాద్కు చెందిన 25 ఏళ్ల పర్యాటకుడు సతీష్ రాజేష్ భాయ్ ప్యారాగ్లైడర్ కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇక 2025 జనవరిలో గోవాలోని కెరి గ్రామంలో జరిగిన మరో ఘోర ప్రమాదంలో శివాని డాబ్లే, ఆమె ఇన్స్ట్రక్టర్ సుమల్ నేపాలి మృతి చెందారు. కెరి పీఠభూమి నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే వారు లోయలో పడిపోయారు. ఈ వరుస ఘటనలు దేశవ్యాప్తంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహణలో భద్రతా ప్రమాణాలు, నిబంధనల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నిపుణులు కఠినమైన నియంత్రణలు, మెరుగైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
📍Goa: On March 29, a parasailing cable snapped during the activity, leading to a frightening incident. The video raises concerns about safety standards in adventure sports. pic.twitter.com/9t0Gn2GLe6
— Deadly Kalesh (@Deadlykalesh) March 30, 2026