NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pakistan: ఉద్రిక్తతల వేళ కరాచీ తీరంలో క్షిపణి పరీక్షకు సిద్దమైన పాకిస్థాన్.. హై అలర్ట్‌లో ముంబయి 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pakistan: ఉద్రిక్తతల వేళ కరాచీ తీరంలో క్షిపణి పరీక్షకు సిద్దమైన పాకిస్థాన్.. హై అలర్ట్‌లో ముంబయి 
    ఉద్రిక్తతల వేళ కరాచీ తీరంలో క్షిపణి పరీక్షకు సిద్దమైన పాకిస్థాన్.. హై అలర్ట్‌లో ముంబయి

    Pakistan: ఉద్రిక్తతల వేళ కరాచీ తీరంలో క్షిపణి పరీక్షకు సిద్దమైన పాకిస్థాన్.. హై అలర్ట్‌లో ముంబయి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    11:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack) తాలూకు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భారత్ పాకిస్థాన్‌తో తన దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

    ఇదే సమయంలో పాకిస్థాన్ కూడా ప్రాధాన్యత గల చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో భాగంగా భూమిపై నుండి భూమిపైకి ప్రయాణించే క్షిపణుల (surface-to-surface missiles) పరీక్షల కోసం పాకిస్థాన్ సిద్ధమవుతోంది.

    ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీర ప్రాంతం వెంబడి ఉన్న ఎకనామిక్ ఎక్స్లూజివ్ జోన్‌లో ఈ క్షిపణి ప్రయోగాలు నిర్వహించబోతున్నట్లు పాకిస్థాన్ ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది.

    ఈ పరిణామాలపై భారత రక్షణ శాఖకు చెందిన ఏజెన్సీలు తీవ్ర నిగాహా ఉంచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

    వివరాలు 

    అమానుష ఘటనలో మొత్తం 26 మంది మృతి 

    ఇదిలా ఉండగా, మంగళవారం సాయంత్రం పహల్గాంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బైసరన్ వద్ద ముష్కరులు హఠాత్తుగా ఉల్లాసానికి వచ్చిన పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డారు.

    సైనిక దుస్తుల్లో కనిపించిన ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని తుపాకులతో దాడి చేశారు.

    ఈ అమానుష ఘటనలో మొత్తం 26 మంది మరణించారు. ఈ సంఘటన నేపథ్యంలో బుధవారం భద్రతా వ్యవహారాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

    వివరాలు 

    ముంబయిలో హైఅలర్ట్‌ 

    పహల్గాం దాడి అనంతరం దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

    ముఖ్యంగా ముంబయిలో భద్రతా ఏర్పాట్లను మరింత బలపరిచారు. నగరమంతా పోలీసు బలగాలు రాత్రిపూట క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.

    సీనియర్ అధికారులు రోజువారీగా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

    బీచ్‌లు, ఫైవ్ స్టార్ హోటల్స్, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ప్రజలు అధికంగా కేంద్రీకృతమయ్యే ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    పాకిస్థాన్

    Champions Trophy: భారత్ చేతిలో ఓడిన తర్వాత కూడా పాకిస్థాన్ సెమీ-ఫైనల్‌కు వెళ్లే అవకాశం..! ఎలా అంటే.. క్రీడలు
    Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ఐసిస్ స్కెచ్!.. భద్రతా దళాలకు పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక అంతర్జాతీయం
    Aaqib Javed: పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డులో ప్రకంపనలు.. కోచ్‌ అకిబ్‌పై వేటు? క్రీడలు
    ICC Champions Trophy 2025: పాక్‌ క్రికెట్ పతనం.. బాబర్ అజామ్ నేతృత్వంపై మాజీ క్రికెటర్ల అసంతృప్తి ఐసీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025