NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / డెహ్రాడూన్‌: ఏడేళ్ల బాలుడికి మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలను చూపించి.. ఆపై అఘాయిత్యం 
    తదుపరి వార్తా కథనం
    డెహ్రాడూన్‌: ఏడేళ్ల బాలుడికి మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలను చూపించి.. ఆపై అఘాయిత్యం 
    డెహ్రాడూన్‌: ఏడేళ్ల బాలుడికి మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలను చూపించి.. ఆపై అఘాయిత్యం

    డెహ్రాడూన్‌: ఏడేళ్ల బాలుడికి మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలను చూపించి.. ఆపై అఘాయిత్యం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 13, 2023
    10:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    డెహ్రాడూన్‌ లోని రాయ్‌పూర్ ప్రాంతంలో 12 ఏళ్ల విద్యార్థి తన మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలను చూపించి ఏడేళ్ల బాలుడిపై అసభ్యంగా ప్రవర్తించాడు.

    టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం,ఈ సంఘటన జూన్‌లో జరిగింది. అయితే 3వ తరగతి విద్యార్థి తండ్రి బుధవారం ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

    ఏడేళ్ల బాలుడు, 7వ తరగతి విద్యార్థి ఇద్దరూ పరిసరాల్లో ఉంటున్నారని ఒక పోలీసు అధికారిని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.

    నిందితుడు ఒంటరిగా ఉన్న సమయంలో బాలుడి ఇంట్లోకి ప్రవేశించి, అతని మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలను చూపించి, ఆపై అతనితో అసభ్యంగా ప్రవర్తించాడు.

    ఈ విషయమై తన కుటుంబానికి చెప్పవద్దని కోరుతూ అతను వెళ్లిపోయాడని పోలీసు అధికారి చెప్పాడు.

    Details 

    పోలీసులకు ఫిర్యాదు చెయ్యకూడదని నిర్ణయం 

    ఈ సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత, రెండు కుటుంబాలకు విషయం తెలిసింది. కానీ పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు నివేదిక పేర్కొంది.

    పోలీసులకు ఫిర్యాదును చెయ్యకుండా ఏడేళ్ల బాలుడి కుటుంబంతో ఒప్పందం ఆధారంగా నిందితుడిని పట్టణంలోని బంధువుల ఇంటికి పంపారు.

    అయితే, కొన్ని వారాల క్రితం, బాలుడు ఇంటికి తిరిగి వచ్చాడు. చివరికి ఏడేళ్ల బాలుడి కుటుంబం అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో వారు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Details 

    డెహ్రాడూన్ పాఠశాలల్లో ఇతర భయంకరమైన నేరాలు

    నాలుగేళ్ల క్రితం,2019లో,12 ఏళ్ల డెహ్రాడూన్ బోర్డింగ్ స్కూల్ విద్యార్థి వాసు యాదవ్‌ను సీనియర్లు క్రికెట్ బ్యాట్‌లు,వికెట్లతో కొట్టి చంపారు.

    అయితే, పాఠశాల అధికారులు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, విద్యార్థి చనిపోయినట్లు వైద్యులు నిర్దారించి దొంగతనంగా మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

    ది ప్రింట్‌లోని ఒక నివేదిక ప్రకారం, 12 ఏళ్ల పిల్లవాడు తన చేతులు, కాళ్ళను పైపుతో చుట్టి, అతని ఇద్దరు సీనియర్లు బ్యాట్,స్టంప్‌లతో కొట్టారని ఆరోపించారు.

    ఆ తర్వాత అతడిని వివస్త్రను చేసి చల్లటి నీళ్లలో ముంచారని తెలిపాడు. అతని నోట్లో 'కుర్కురే' , బిస్కెట్లు నింపి, టాయిలెట్‌లోని మురికి నీళ్లతో నిండిన బకెట్ సహాయంతో గొంతులోకి నెట్టినట్లు తెలిపాడు.

    Details 

    బాలికపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారం 

    ఈ సంఘటనకు ఒక సంవత్సరం ముందు, డెహ్రాడూన్ జిల్లాలోని సహస్‌పూర్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న బాలికపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

    ఈ విషయాన్ని పాఠశాల అధికారులు రెండు వారాలకు పైగా గోప్యంగా ఉంచారు.

    తను గర్భవతి అయి ఉండొచ్చని గ్రహించి ప్రాణాలతో బయటపడిన ఆమె తన అక్కకు తన బాధను చెప్పడంతో నెల రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బాయ్‌కాట్‌ టర్కీ
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్
    Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..! భార్గవస్త్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025