NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: వానాకాలం నుంచి పంటల బీమా.. పథకం అమలుకు ముందుకొచ్చిన ఏఐసీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: వానాకాలం నుంచి పంటల బీమా.. పథకం అమలుకు ముందుకొచ్చిన ఏఐసీ
    వానాకాలం నుంచి పంటల బీమా.. పథకం అమలుకు ముందుకొచ్చిన ఏఐసీ

    Telangana: వానాకాలం నుంచి పంటల బీమా.. పథకం అమలుకు ముందుకొచ్చిన ఏఐసీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2025
    11:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో వచ్చే వానాకాలం నుంచి ప్రారంభించనున్న పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి భారతీయ వ్యవసాయ బీమా సంస్థ (ఏఐసీ) ముందుకొచ్చింది.

    ప్రైవేటు బీమా సంస్థల కంటే లాభదాయకంగా,రైతులకు ఎక్కువ మేలు చేసేలా,ప్రభుత్వానికి జవాబుదారీగా ఈ పథకాన్ని నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏఐసీ ప్రతిపాదించింది.

    ఇప్పటికే బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేపట్టగా,ఏఐసీ ప్రతిపాదనపై నిపుణులతో అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

    తెలంగాణలో 2021 నుంచి పంటల బీమా పథకం అమలు కాలేదు. వచ్చే వానాకాలం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది.

    బీమా ప్రీమియాన్ని తమకు భారం వేయకుండా రైతులకు ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది.

    వివరాలు 

    ఆచితూచి ప్రభుత్వ స్పందన.. 

    నిబంధనల ప్రకారం, ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.

    ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి ఏఐసీ తమ ప్రతిపాదనను వివరించింది.

    గతంలో రాష్ట్రంలో ప్రైవేటు సంస్థల ద్వారా బీమా పథకం అమలు చేయగా,అది విఫలమైందని తెలిపింది.

    ప్రైవేటు సంస్థలకు విశ్వసనీయత లేదని,బీమా ద్వారా వాటికే అధిక లాభం వస్తోందని పేర్కొంది.

    గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా పంటల బీమాకు ప్రైవేటు సంస్థలకు రూ.28 వేల కోట్ల ప్రీమియం చెల్లించినా, అందులో కేవలం రూ.7,650 కోట్ల క్లెయిమ్‌లు మాత్రమే కంపెనీలు చెల్లించాయని వివరించింది.

    వివరాలు 

    నిపుణులతో అధ్యయనానికి సర్కారు నిర్ణయం 

    ఏఐసీ మాత్రం ప్రభుత్వాల నుంచి వచ్చిన ప్రీమియంలో క్లెయిమ్‌లను తక్కువగా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి ఇవ్వడం వలన, అది వ్యవస్థకు మరింత లాభదాయకంగా ఉంటుందని పేర్కొంది.

    ప్రైవేటు సంస్థల కంటే జవాబుదారీగా, క్రమబద్ధంగా పనిచేస్తుందని తెలిపింది.

    ఏఐసీ ఈ పథకాన్ని ఆశించిన విధంగా అమలు చేస్తుందా? వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలయ్యింది? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది.

    దీనిపై నిపుణులతో పరిశీలన చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్, వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కూడా ఈ అంశంపై అధ్యయనం జరుపుతున్నారు.

    విస్తృతంగా చర్చించిన తర్వాత, అన్నదాతలకు సరైన ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    తెలంగాణ

    TGSRTC Special Buses : సంక్రాంతి సందర్భంగా 1740 ప్రత్యేక బస్సులు.. తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన భారతదేశం
    New Energy policy: తెలంగాణ కొత్త ఇంధన విధాన పత్రం విడుదలకు సిద్ధం.. ఎప్పుడంటే? ఇండియా
    Tg Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్.. ఈ నెలాఖారులోగా ఇళ్ల మంజూరు భారతదేశం
    Venkaiah Naidu: 'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక ఉప రాష్ట్రపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025