NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై నిషేధం విధించిన ఎయిర్ ఇండియా
    తదుపరి వార్తా కథనం
    మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై నిషేధం విధించిన ఎయిర్ ఇండియా
    మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై ఎయిర్ ఇండియా నిషేధం

    మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై నిషేధం విధించిన ఎయిర్ ఇండియా

    వ్రాసిన వారు Stalin
    Jan 04, 2023
    10:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యూయార్క్ నుంచి దిల్లీ ప్రయాణిస్తున్నవిమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై ఎయిర్ ఇండియా చర్యలు తీసుకుంది. మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడిపై 30 రోజలు పాటు నిషేధం విధించింది. నిషేధం ఉన్నన్ని రోజులు ఎయిర్ ఇండియా విమానంలో అతడు ప్రయాణించడానికి వీలు లేదని ఎయిర్ ఇండియా చెప్పింది.

    తదుపరి చర్యల కోసం.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నివేదించినట్లు యాజమాన్యం పేర్కొంది. తమ బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా వివరించింది. ఇదిలా ఉంటే.. మహిళా ప్రయాణికురాలి ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఎయిర్ ఇండియా

    అంతర్గత కమిటీ ఏర్పాటు

    నవంబర్ 26, 2022న న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో మద్యం మత్తులో ఓ వ్యక్తి తొటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు.

    మూత్ర విసర్జన ఘటనపై అంతర్గత కమిటీని కూడా ఎయిర్ ఇండియా యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అతడిపై 30రోజుల నిషేధం విధించింది. అలాగే నిందింతుడిని 'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చాలని ప్రభుత్వానికి ఎయిర్‌ఇండియా సిఫారసు చేసింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం‌ కోసం ఎదురుచూస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    భారతదేశం

    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు వ్యాపారం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ రాజస్థాన్
    లద్దాఖ్‌‌లో భారత సైనికుల పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరణకు ఒప్పుకోని చైనా భారతదేశం
    లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి సిక్కిం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025