NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో అక్షయ తృతీయ సందడి.. 42 అడుగుల ధ్వజస్తంభ ప్రతిష్టాపన
    తదుపరి వార్తా కథనం
    Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో అక్షయ తృతీయ సందడి.. 42 అడుగుల ధ్వజస్తంభ ప్రతిష్టాపన
    అయోధ్య రామాలయంలో అక్షయ తృతీయ సందడి.. 42 అడుగుల ధ్వజస్తంభ ప్రతిష్టాపన

    Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో అక్షయ తృతీయ సందడి.. 42 అడుగుల ధ్వజస్తంభ ప్రతిష్టాపన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 30, 2025
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని అయోధ్య రామమందిరంలో 42 అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు.

    ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌ అధికారికంగా తెలిపారు.

    వైశాఖ శుక్ల పక్ష విదియ, మంగళవారం ఉదయం 8 గంటలకు ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడిందని వెల్లడించారు.

    ఈ పుణ్యకార్యానికి సంబంధించిన చిత్రాలను ఇంటర్నెట్‌ వేదికగా పంచగా, నెటిజనుల నుంచి విశేష స్పందన వచ్చింది.

    Details

    త్వరలోనే ఏడు మండపాల నిర్మాణం పూర్తి

    ఇక రామమందిర నిర్మాణంలో వేగం పెంచిన ట్రస్టు, త్వరలోనే ఏడు మండపాల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపింది.

    అలాగే రామ్‌దర్భార్‌లో శ్రీరాముడితో పాటు సీత, లక్ష్మణ, హనుమాన్, భరత, శతృఘ్నుల విగ్రహాలు మే నెలలోనే రానున్నట్లు సమాచారం.

    ఆలయ ఈశాన్య దిశలో శివాలయం, నైరుతి దిశలో సూర్యదేవాలయ నిర్మాణం కూడా కొనసాగుతోందని ట్రస్టు వెల్లడించింది.

    మొత్తం నిర్మాణ పనులను ఈ ఏడాది అక్టోబర్‌ లోపే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య

    తాజా

    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్

    అయోధ్య

    PM Modi: రామమందిర ప్రారంభోత్సవం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Ayodhya Ram Mandir: అయోధ్య 'ప్రాణ ప్రతిష్టకు'ఎల్‌కే అద్వానీ దూరం.. ఎందుకంటే?  భారతదేశం
    Sri Ram puja: అయోధ్య రామాలయం ప్రారంభోత్స వేళ.. మీ ఇంట్లోనే శ్రీరాముడిని ఈ విధానంలో పూజించండి శ్రీరాముడు
    Ram Mandir History: 75 సంవత్సరాల అయోధ్య రామమందిర చరిత్ర భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025