NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ayodhya Ram Mandir: అయోధ్యలో అలర్ట్‌.. రామ మందిర ట్రస్టుకు బెదిరింపు మెయిల్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ayodhya Ram Mandir: అయోధ్యలో అలర్ట్‌.. రామ మందిర ట్రస్టుకు బెదిరింపు మెయిల్‌
    అయోధ్యలో అలర్ట్‌.. రామ మందిర ట్రస్టుకు బెదిరింపు మెయిల్‌

    Ayodhya Ram Mandir: అయోధ్యలో అలర్ట్‌.. రామ మందిర ట్రస్టుకు బెదిరింపు మెయిల్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 14, 2025
    05:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు ఇటీవల ఒక అనుమానాస్పద ఈ-మెయిల్‌ వచ్చింది. ఇందులో రామాలయ భద్రతపై హెచ్చరికలు ఉండటంతో ట్రస్ట్‌ సర్వత్రా అప్రమత్తమైంది.

    మెయిల్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తును ప్రారంభించిన ట్రస్ట్‌తో పాటు భద్రతా సంస్థలు, జిల్లా పోలీసు పరిపాలన బృందం కూడా రంగంలోకి దిగాయి.

    ఈ మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే కోణాల్లో అధికారులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు.

    ఈ మెయిల్‌లో రామాలయంపై బెదిరింపులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక పోలీసులు, నిఘా సంస్థలు సంఘటితంగా చర్యలు తీసుకుంటున్నాయి.

    భద్రతా ఏర్పాట్లను మరింత కఠినంగా మార్చారు. ప్రాథమిక దర్యాప్తులో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఈ మెయిల్ పంపినట్లు సమాచారం లభించింది.

    Details

    గతంలోనూ బెదిరింపులు

    ఇది కొత్త పరిణామం కాదు. రామాలయంపై గతంలోనూ అనేక బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.

    ఇప్పటికే 2024 సెప్టెంబర్‌లో రామాలయంపై బాంబు దాడి చేస్తామనే బెదిరింపు మెయిల్‌ వచ్చింది.అప్పట్లోనూ ఇదే తరహాలో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి.

    ఈ తరహా ఉగ్ర ముప్పుల దృష్ట్యా అయోధ్య నగరంలో భద్రతను బలపరిచారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు, ఆలయం చుట్టూ అనేక భద్రతా పాయింట్లను ఏర్పాటు చేశారు.

    అంతేకాదు మొత్తం ప్రాంతాన్ని డ్రోన్‌ నిఘాలోకి తీసుకొచ్చారు.

    Details

    గోడ నిర్మాణ ప్రారంభం

    ఎలాంటి అనుమానాస్పద కదలికలైనా వెంటనే గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.

    ఇంతేకాదు, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ ఆలయ భద్రత కోసం దాదాపు 4 కిలోమీటర్ల పొడవున్న భద్రతా గోడ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు.

    ఈ గోడ నిర్మాణాన్ని ఇంజినీర్ ఇండియా లిమిటెడ్‌ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ గోడ నిర్మాణం 18 నెలల్లో పూర్తి కానుందని ఆయన వెల్లడించారు.

    ఈ ఘటనతో రామాలయ భద్రతపై మరోసారి చర్చ మొదలైందని చెప్పవచ్చు. కాగా ఈ బెదిరింపు మెయిల్‌కు సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య
    రామమందిరం

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    అయోధ్య

    Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి 101 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత ఎవరో తెలుసా? సూరత్
    Ayodhya ram mandir: 13వేల మంది బలగాలు, 10వేల సీసీ కెమెరాలు.. రామమందిర ప్రారంభోత్సవానికి భద్రత కట్టుదిట్టం  శ్రీరాముడు
    PM Modi: రామమందిర ప్రారంభోత్సవం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Ayodhya Ram Mandir: అయోధ్య 'ప్రాణ ప్రతిష్టకు'ఎల్‌కే అద్వానీ దూరం.. ఎందుకంటే?  భారతదేశం

    రామమందిరం

    270 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్‌ ఆలయ నిర్మాణం ప్రారంభం  బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025