LOADING...
Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే,అన్నాడీఎంకే కలిస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేయాలని టీవీకే నిర్ణయం
మూకుమ్మడిగా రాజీనామా చేయాలని టీవీకే నిర్ణయం

Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే,అన్నాడీఎంకే కలిస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేయాలని టీవీకే నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2026
11:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు గడిచినా,విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదు. రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఒకవైపు టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా కదులుతూ చిన్న చిన్న పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. మద్దతు సాధించేందుకు ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా,ఒక దశలో ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే,అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా రహస్య చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈపరిణామం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తి రేపింది.అయితే, ఈ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకా 12 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది.

వివరాలు 

107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం

దీంతో ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి ముందుకు వస్తే టీవీకే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై కూడా చర్చ నడుస్తోంది. ఈ రెండు పార్టీలు కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే, టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. విజయ్ రెండు స్థానాల్లో గెలవడంతో ఆ పార్టీ మొత్తం బలం 108కి చేరింది. ఈ పరిణామాలపై సంబంధిత వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా జాతీయ స్థాయి మాధ్యమాల్లో కూడా కథనాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎటు మలుపు తిరుగుతాయన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

Advertisement