LOADING...
Nara lokesh: గూగుల్, ఇంటెల్, అడోబ్, ఎన్‌విడియా, జూమ్‌ సంస్థల ప్రతినిధులతో.. మంత్రి లోకేశ్ భేటీ 
మంత్రి లోకేశ్ భేటీ

Nara lokesh: గూగుల్, ఇంటెల్, అడోబ్, ఎన్‌విడియా, జూమ్‌ సంస్థల ప్రతినిధులతో.. మంత్రి లోకేశ్ భేటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా పర్యటనలో భాగంగా, ప్రపంచంలో ప్రముఖ టెక్నాలజీ సంస్థలైన గూగుల్, ఇంటెల్, అడోబ్, ఎన్‌విడియా, జూమ్‌ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం సాంకేతిక అభివృద్ధిలో ఉన్నదని, సెమీకండక్టర్ల తయారీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటు కోసం అనుకూలమైన ఎకోసిస్టమ్‌ ఏర్పాటుపై ఆయన వివరించారు. మంత్రి లోకేష్‌ గూగుల్‌ ప్రతినిధులకు విశాఖలో ఏర్పాటు చేయబోయే డ్రోన్‌ సిటీ ప్రాజెక్ట్‌లో డ్రోన్ అసెంబ్లింగ్, టెస్టింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్‌ కురియన్‌, గూగుల్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్‌ ప్రెసిడెంట్ బికాస్ కోలీ పాల్గొన్నారు.

గూగుల్ 

వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకోసిస్టమ్

సమావేశంలో విశాఖలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ప్రారంభం, దాని కొనసాగుతున్న పనుల గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంలో మంత్రి లోకేష్‌ విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించమని సూచించారు. అలాగే, విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి గూగుల్ అంగీకరించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌లో గూగుల్ క్లౌడ్ రీజియన్ల విస్తరణకు తోడుగా, 'గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్' కార్యక్రమం ద్వారా స్టార్టప్‌లకు మద్దతు అందించబడుతున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఇంటెల్‌  

ఇంటెల్‌ ఏటీఎంపీ యూనిట్‌ ఏర్పాటు చేయండి 

రాష్ట్రంలో ఉత్పత్తుల అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్‌ (ATP) యూనిట్లను ఏర్పాటు చేయడం గురించి ఇంటెల్‌ పరిశీలనకు తీసుకోవాలని మంత్రి లోకేశ్‌ కోరారు. అలాగే, ఇంటెల్‌-అమరావతి AI రీసెర్చ్ సెంటర్‌ను శ్రీసిటీలో, ట్రిపుల్‌ఐటీ/ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో స్థాపించే అంశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు. ఆ సంస్థ ఐటీ విభాగం సీటీవో శేష కృష్ణపురతో భేటీ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఏపీ ప్రభుత్వం, ఇంటెల్‌ మధ్య కుదురుకున్న అవగాహన ఒప్పందాన్ని వేగంగా అమలు చేయాలి. ఇంటెల్‌ ఆధారిత HPC (హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్) క్లస్టర్లను ఏర్పాటు చేసి, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య, వ్యవసాయ, వాతావరణ నమూనా పరిశోధనలకు సహకారం అందించాలి.

Advertisement

ఇంటెల్

ఇంటెల్‌ ఏటీఎంపీ యూనిట్‌ ఏర్పాటు చేయండి 

భవిష్యత్తు నైపుణ్యాలున్న వర్క్‌ఫోర్స్‌ను తయారు చేసే విధంగా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలి. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ పాఠ్య ప్రణాళికల్లో ఇంటెల్‌ శిక్షణ కార్యక్రమాలను చేర్చడం పరిశీలించాలి. ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో ఇంటెల్‌ స్కిల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలి. VLSI డిజైన్, సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ మూలాలు, AI, రోబోటిక్స్‌లో ప్రత్యేక శిక్షణలు అందించాలి.

Advertisement

అడోబ్

అడోబ్‌ జీసీసీ ఏర్పాటును పరిశీలించండి 

విశాఖపట్టణంలో అడోబ్‌ గ్లోబల్‌ కేపబిలిటి సెంటర్‌ (జీసీసీ) లేదా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ అడోబ్‌ సంస్థను కోరారు. ఆ సంస్థ సీఈవో శంతను నారాయణ్‌తో భేటీలో మాట్లాడుతూ.. అమెరికాలోని టెక్‌ దిగ్గజ సంస్థలైన ఇంటెల్,ఏఎండీ, అప్లైడ్‌ మెటీరియల్స్‌ వంటి సంస్థలను అనుసంధానించి ఫ్యాబ్‌లెస్‌ డిజైన్‌, పరిశోధన,తయారీ కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలి. మీరు డైరెక్టర్‌గా ఉన్న ఫైజర్‌ సంస్థ ద్వారా టీకాలు, చిన్న మాలిక్యూల్స్‌, బయోలాజిక్స్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించమని, అలాగే మరో సంస్థ కేకేఆర్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే విధానంలో సహకరించమని విజ్ఞప్తి చేశారు.దీని ప్రతిస్పందనగా,నారాయణ్‌ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

జూమ్ 

వర్చువల్‌ తరగతుల నిర్వహణలో సహకరించాలి 

అమరావతి లేదా విశాఖపట్నంలో జూమ్ సంస్థకు చెందిన పరిశోధన, అభివృద్ధి/ఇంజినీరింగ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ప్రతినిధులను కోరారు. జూమ్ సంస్థ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ అండ్ ఇంజినీరింగ్ విభాగ ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ, "పట్టణ ప్రాంత నిపుణుల సహకారంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు వర్చువల్ తరగతులు నిర్వహించడంలో సహాయం చేయండి. అలాగే, రాష్ట్రంలో జూమ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా టెలిమెడిసిన్ సేవలు, ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సాంకేతిక మద్దతు అందించగలరు" అని అభ్యర్థించారు. ఇవన్నీ పరిశీలిస్తామంటూ శంకరలింగం సమాధానమిచ్చారు.

ఏఐ

ఏఐ నైపుణ్యాభివృద్ధిలో సహకరించండి 

ఏపీ రాష్ట్రంలో ఏఐ నైపుణ్య అభివృద్ధి, స్మార్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్, భవిష్యత్ సాంకేతికతల బలోపేతం కోసం సహకారం అందించాలని గేమింగ్, చిప్‌ డిజైన్, జీపీయూ తయారీ లో అగ్రగామిగా ఉన్న ఎన్‌విడియా సంస్థను రాష్ట్ర మంత్రి లోకేశ్ కోరారు. ఈ సమావేశంలో ఎన్‌విడియా వైస్‌ ప్రెసిడెంట్ ఎంటర్‌ప్రైజ్‌ అండ్‌ క్లౌడ్‌ సేల్స్‌ రాజ్‌ మిర్‌పురి పాల్గొన్నారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, పౌర సేవల్లో ఏఐ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు శిక్షణ అందించడానికి సూచనలు చేయాలని, ఏఐ పాఠ్యాంశాల రూపకల్పనలో మార్గదర్శక సూచనలు అందించాలని, విద్యార్థులు, పరిశోధకులు క్వాంటమ్ సిమ్యులేటర్లు ఉపయోగించేందుకు ఏపీలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాలని ప్రతిపాదించారు.

ఏఐ

ఏఐ నైపుణ్యాభివృద్ధిలో సహకరించండి 

డిజిటల్ ట్విన్, ఏఐ ఆధారిత పరిశ్రమల ఆప్టిమైజేషన్ కోసం ఎన్‌విడియా ఓమ్నివర్స్, ఐజాక్ సిమ్ ఉపయోగించే స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాలని, భారత్‌లో డీప్‌టెక్‌ స్టార్టప్‌ల కోసం ఎన్‌విడియా కేటాయించిన 850 మిలియన్‌ డాలర్లను ఏపీలోని డీప్‌టెక్ స్టార్టప్‌లు, మెంటారింగ్‌ కార్యక్రమాల కోసం వినియోగించాలని ప్రతిపాదించారు. రాజ్‌ మిర్‌పురి ఈ ప్రతిపాదనలపై ఎన్‌విడియా ఉన్నత స్థాయి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Advertisement