NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amid Puja Khedkar: IAS అధికారులు, ట్రైనీలను నియంత్రించే నియమాలు కఠినతరం
    తదుపరి వార్తా కథనం
    Amid Puja Khedkar: IAS అధికారులు, ట్రైనీలను నియంత్రించే నియమాలు కఠినతరం
    Amid Puja Khedkar: IAS అధికారులు, ట్రైనీలను నియంత్రించే నియమాలు కఠినతరం

    Amid Puja Khedkar: IAS అధికారులు, ట్రైనీలను నియంత్రించే నియమాలు కఠినతరం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 17, 2024
    10:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోనే సంచలనం సృష్టించిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణిగా పూజా ఖేద్కర్ గుర్తింపు పొందిన సంగతి విదితమే.

    సివిల్ సర్వెంట్‌గా అధికార దుర్వినియోగానికి పాల్పడిన వివాదానికి కేంద్రబిందువుగా నిలిచిన పూజా ఖేద్కర్ అనే ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వ జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి రిలీవ్ అయ్యారు.

    పూజా ఖేద్కర్‌ను ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)కి వెనక్కు పిలిపించారు.ఆమె శిక్షణ తాత్కాలికంగా నిలిపివేశారు.

    వివాదాల మధ్య, మహారాష్ట్ర ప్రభుత్వం గత వారం ఖేద్కర్‌ను పూణె నుండి వాషిమ్‌కు బదిలీ చేసింది.

    వివరాలు 

    వివాదాల ఖేద్కర్‌ కు తన చర్యల వల్లే ఖేదం

    ఇంతలో, సివిల్ సర్వీసెస్‌లో ఆమె అభ్యర్థిత్వాన్ని పొందేందుకు ఖేద్కర్ సమర్పించిన అన్ని పత్రాలను పరిశీలించడానికి కేంద్రం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

    ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, పౌర సేవకురాలిగా పూజా ఖేద్కర్ చర్యలు రెండు కీలక నియమాల ద్వారా నిర్వహించనున్నారు.

    ఆల్ ఇండియా సర్వీసెస్ (ప్రవర్తన) రూల్స్, 1968 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ప్రొబేషన్) రూల్స్, 1954. ఒకసారి చూద్దాం.

    అన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ,ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారులు వారి శిక్షణ సమయం నుండి AIS (ప్రవర్తన) నియమాల ద్వారా నిర్వహించుతారు.

    దీని ప్రకారం, సర్వీస్‌లోని సభ్యులందరూ విధికి విశ్వసనీయతను కలిగి ఉండాలి.

    వివరాలు 

    అధికారుల నిర్ణయాలు 

    నిబంధనల ప్రకారం, ఏ ప్రైవేట్ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో కుటుంబ సభ్యులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు అధికారులు తమ కార్యాలయాన్ని ఉపయోగించకూడదు.

    తరువాత, 2014లో, కేంద్రం కొన్ని ఉప-నిబంధనలను చేర్చింది. ఇందులో అధికారులు నీతి, సమగ్రత, నిజాయితీ, రాజకీయ తటస్థత, జవాబుదారీతనం, పారదర్శకత, ప్రజలకు, ముఖ్యంగా బలహీన వర్గాల పట్ల సున్నితత్వం కలిగి వుండాలి.

    ప్రజల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.

    ఇవన్నీ పూజా ఖేద్కర్ ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి.

    ప్రయివేటు ప్రయోజనాలకు తావులేకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

    ఒక అధికారి తనను ప్రభావితం చేసే ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఆర్థిక లేదా ఇతర బాధ్యతలు విధించకూడదు.

    వివరాలు 

     ప్రతి అధికారికి ఖచ్చితమైన మార్గదర్శకాలు

    సివిల్ సర్వెంట్‌గా మీ పదవిని దుర్వినియోగం చేయకూడదు.

    మీ కోసం, మీ కుటుంబం లేదా మీ స్నేహితుల కోసం ఆర్థిక లేదా భౌతిక ప్రయోజనాలను పొందేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, నిబంధనలు జోడించారు.

    2015లో సవరించిన నిబంధనలు ఇలా వున్నాయి.

    25,000 కంటే ఎక్కువ విలువ ఉన్న అధికారులకు దగ్గరి బంధువులు లేదా స్నేహితులు ఇచ్చే బహుమతుల గురించి ప్రభుత్వానికి తెలియజేయాలి.

    నిబంధనల ప్రకారం, ప్రొబేషనరీ IAS అధికారులు వారి శిక్షణ కాలంలో స్థిరమైన జీతం , ప్రయాణ భత్యం పొందుతారు.

    వివరాలు 

    ప్రత్యేక అధికారాలకు వారు అర్హులు కాదు 

    అయినప్పటికీ, VIP నంబర్ ప్లేట్ ఉన్న అధికారిక కారు, అధికారిక వసతి, తగినంత సిబ్బంది ఉన్న అధికారిక గది , కానిస్టేబుల్ వంటి IAS అధికారులు అనుభవించే ప్రత్యేక అధికారాలకు వారు అర్హులు కాదు.

    ట్రైనీ రిక్రూట్‌మెంట్‌కు "అనర్హుడని" లేదా సర్వీస్ మెంబర్‌గా ఉండటానికి అనర్హుడని గుర్తించితే కేంద్రం ట్రైనీని అనర్హులుగా ప్రకటించవచ్చు.

    అలాగే ట్రైనీ చదువులు , విధులను విస్మరిస్తే, సర్వీస్ కోసం ట్రైనీ ప్రవర్తన అవసరం లేకుంటే ఉద్వాసన పలకవచ్చు.

    సారాంశ విచారణ తర్వాత కేంద్రం దీనిని నిర్ణయిస్తుంది.

    పూజా ఖేద్కర్ కేసులో, ఆమె సమర్పించిన అన్ని పత్రాలను పరిశీలించడానికి ప్రభుత్వం ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

    వివరాలు 

    నకిలీ సర్టిఫికెట్లు సమర్పించడానికి నియమాలు

    పూజా కేద్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో క్లియర్ చేయడానికి నకిలీ అంగవైకల్యం ,ఇతర వెనుకబడిన తరగతుల (OBC) సర్టిఫికేట్‌లను అందించినట్లు ఆరోపణలు వచ్చాయి.

    ఆమె మానసిక అనారోగ్య ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

    ఏప్రిల్ 2022లో, ఆమె వైకల్య ధృవీకరణ పత్రం ఖరారు కోసం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో రిపోర్టు చేయవలసిందిగా కోరింది.

    అయితే కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ను ఉటంకిస్తూ ఆమె అలా చేయలేదని PTI తెలిపింది. 'ముఖ్యంగా, సివిల్ సర్వీసెస్‌లో 27 శాతం సీట్లు ఓబీసీ కేటగిరీకి, సాధారణంగా మూడు శాతం సీట్లు ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీలు దివ్యాంగులకు రిజర్వ్ చేశారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పూజా ఖేద్కర్‌

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    పూజా ఖేద్కర్‌

    Pooja Khedkar:నకిలీ ఓబిసి,మెడికల్ సర్టిఫికేట్‌లను ఉపయోగించిన మహారాష్ట్ర ఐఏఎస్ .. మాక్ ఇంటర్వ్యూ వైరల్   భారతదేశం
    Pooja Khedkar: సో సారీ..': ఆరోపణల నేపథ్యంలో మీడియా ముందుకు తొలిసారి ఐఏఎస్ ప్రొబేషనర్ ఖేద్కర్ భారతదేశం
    Puja Khedkar : పూజా ఖేద్కర్ ఏకపక్ష ధోరణి.. ఏక వ్యక్తి కమిటీతో UPSC విచారణ భారతదేశం
    Pooja Khedkar: పూజా ఖేద్కర్ బీకాన్-లైట్ ఆడిలో 21 పెండింగ్ చలాన్‌లు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025