NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా
    తదుపరి వార్తా కథనం
    Amit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా
    Amit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా

    Amit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా

    వ్రాసిన వారు Stalin
    Feb 10, 2024
    02:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    Amit Shah CAA: భారతీయ జనతా పార్టీ (BJP) లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.

    ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (CAA) దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తామని భారీ ప్రకటన చేశారు.

    'ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్'లో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడారు.

    ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. సీఏఏ అనేది ఎవరి పౌరసత్వాన్ని తీసివేయదని అమిత్ షా స్పష్టం చేశారు.

    పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లో మతపరమైన హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు పౌరసత్వం మంజూరు చేయడం కోసమే దీన్ని తీసుకొస్తున్నట్ల వివరించారు.

    సీఏఏ

    ముస్లింలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి: అమిత్ షా

    సీఏఏ విషయంలో ప్రతిపక్షాలు ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. అలాగే వారిని రెచ్చగొడుతున్నాయన్నారు.

    వచ్చే ఏడు రోజుల్లో సీఏఏను అమలు చేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

    ఈ బిల్లు 2019 డిసెంబర్‌లోనే పార్లమెంటులో ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా బిల్లుకు ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది.

    ఈ చట్టం బంగ్లాదేశ్, పాకిస్థాన్, అప్గాన్‌లోని మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం మంజూరు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

    ఈ క్రమంలో ఈ సారి సీఏఏను అమలు చేయకుండా ఎవరూ ఆపలేరని అమిత్ షా అన్నారు.

    సీఏఏ

    చట్టం అమలోకి వస్తే ఏమవుతుంది?

    ఈ చట్టం ప్రకారం, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లోని మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వబడుతుంది.

    2014 వరకు ఏదైనా వేధింపుల కారణంగా భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం లభిస్తుంది.

    ఇందులో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు ఉంటారు. ఈ బిల్లు 2016లోనే లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందలేకపోయింది.

    అయితే 2019లో తిరిగి ప్రవేశపెట్టారు. 2020 జనవరి 10న రాష్ట్రపతి ఆమోదించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు కరోనాతో సరిపోవడంతో కేంద్రం సీఏఏపై దృష్టి సారించలేదు.

    ఈ చట్టం ప్రకారం, 9 రాష్ట్రాలకు చెందిన 30 కంటే ఎక్కువ కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇవ్వబడతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    హోంశాఖ మంత్రి
    తాజా వార్తలు

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    అమిత్ షా

    ఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష దిల్లీ
    అమిత్ షా సమక్షంలో రూ.2,378 కోట్ల డ్రగ్స్ ధ్వంసం దిల్లీ
    CRCS-Sahara Refund Portal: సహారా డిపాజిటర్ల రీఫండ్ కోసం పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం  సహకార శాఖ మంత్రి
    అమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ  తెలంగాణ

    హోంశాఖ మంత్రి

    చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం ఆంధ్రప్రదేశ్
    దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం జమ్ముకశ్మీర్

    తాజా వార్తలు

    Guntur Kaaram OTT: ఓటీటీలోకి 'గుంటూరు కారం.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే!  గుంటూరు కారం
    Joe Biden: 96శాతం ఓట్లతో 'సౌత్ కరోలినా' ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ విజయం అమెరికా అధ్యక్ష ఎన్నికలు
    World cancer day: ఇద్దరి కంటే ఎక్కువ మందితో సెక్స్ చేస్తే గర్భాశయ క్యాన్సర్? క్యాన్సర్
    UP ATS: భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ ఏజెంట్.. మీరట్‌లో అరెస్టు  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025