LOADING...
Amit Shah: రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదు.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు
రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదు.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

Amit Shah: రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదు.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజకీయ రంగంలో ఎలాంటి సీటు ఖాళీగా లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టంచేశారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతారని, దేశంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా యథావిధిగా ఉంటారని ఆయన తెలిపారు. బిహార్ రాష్ట్రంలోని దర్భంగా ప్రాంతంలో బుధవారం జరిగిన భారీ ప్రజాసభలో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల వాతావరణం బిహార్‌లో వేడెక్కుతున్న తరుణంలో రాజకీయ పక్షాలు తమ వ్యూహాలను వేగవంతం చేస్తున్నాయి. ఎన్డీయే కూటమి, ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్‌పై మరోసారి అధికారం దక్కించుకునేందుకు బలంగా ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో విపక్ష కూటమి తమ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌ను ఇప్పటికే ప్రకటించగా, ఎన్డీయే తరఫున ఎవరు సీఎం అభ్యర్థి అన్న దానిపై స్పష్టత లేకపోవడం చర్చనీయాంశమైంది.

వివరాలు 

పహల్గాం దాడి గురించి ప్రస్తావించిన అమిత్ షా 

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇటీవలే"నీతీశ్‌ కుమార్ నాయకత్వంలోనే బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తాం" అని స్పష్టం చేశారు. తాజాగా అమిత్‌ షా కూడా అదే ధోరణిని పునరుద్ఘాటించారు.''నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోనే బిహార్‌లో ఎన్డీయే ఎన్నికల్లో పాల్గొంటుంది. ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు''అని ఆయన తెలిపారు. దీంతో ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరన్న సందిగ్ధతకు ముగింపు పలికినట్టైంది. అమిత్‌ షా తన ప్రసంగంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రస్తావించారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించడం ద్వారా రాష్ట్ర గౌరవాన్ని మోదీ మరింత ఎత్తుకు తీసుకెళ్లారని చెప్పారు. అలాగే పహల్గాం ఉగ్రదాడి సందర్భాన్నిగుర్తుచేస్తూ,''ఆ దాడి జరిగిన వెంటనే ప్రధాని మోదీ ఆపరేషన్‌ సిందూర్‌కు ఆదేశాలు ఇచ్చారు''అని వ్యాఖ్యానించారు.