NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amritpal Singh: ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైన ఖలిస్తానీ మద్దతుదారు 
    తదుపరి వార్తా కథనం
    Amritpal Singh: ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైన ఖలిస్తానీ మద్దతుదారు 
    ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైన ఖలిస్తానీ మద్దతుదారు

    Amritpal Singh: ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైన ఖలిస్తానీ మద్దతుదారు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 25, 2024
    11:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న ఖలిస్తాన్ మద్దతుదారు, 'వారిస్ పంజాబ్ దే' సంస్థ అధినేత అమృతపాల్ సింగ్ పంజాబ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

    ఖాదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని అమృతపాల్ తరపు న్యాయవాది వెల్లడించారు.

    జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అమృతపాల్ సింగ్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు.

    అమృతపాల్ తరపు న్యాయవాది రాజ్‌దేవ్ సింగ్ ఖల్సా జైలులో ఆయనను కలిశారు, ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

    ఈ సమయంలో, అమృతపాల్ మీడియాకి వాయిస్ సందేశాన్ని కూడా పంపారు.

    పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమృతపాల్ సిద్ధంగా ఉన్నట్లు ఈ వాయిస్ మెసేజ్‌లో పేర్కొన్నారు.

    Details 

    అమృతపాల్ ఏ కేసులో జైలులో ఉన్నాడంటే ? 

    ఆయన ఏ పార్టీ ఎన్నికల గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేయరు. ఖల్సా ప్రకారం, అమృతపాల్ మే 7- 17 మధ్య నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

    అమృత్‌పాల్ తండ్రి తార్సేమ్ సింగ్, మామ సుఖ్‌చైన్ సింగ్ శుక్రవారం జైలులో అతన్ని కలవనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చ జరగనుంది.

    గత ఏడాది ఫిబ్రవరి 23న అమృత్‌పాల్, అతని సంస్థ 'వారిస్ పంజాబ్ దే'కి సంబంధించిన వ్యక్తులు అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు.

    అమృతపాల్, అతని మద్దతుదారుల చేతుల్లో కత్తులు, కర్రలు ఉన్నాయి. ఈ తతంగం మొత్తం ఎనిమిది గంటల పాటు సాగింది.

    Details 

    అమృతపాల్‌పై జాతీయ భద్రతా చట్టం 

    అమృతపాల్ మద్దతుదారు లవ్‌ప్రీత్ తూఫాన్‌ను విడుదల చేయాలనే డిమాండ్‌పై ఈ గొడవ జరిగింది.

    బరీందర్ సింగ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసినందుకు లవ్‌ప్రీత్ తూఫాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    అయితే, ఆందోళన తర్వాత పోలీసులు అతన్ని విడిచిపెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    దీని తరువాత, అమృతపాల్ సహచరులు చాలా మంది పట్టుబడ్డారు, అయితే అతను చాలా రోజుల వరకు పరారీలో ఉన్నాడు.

    తర్వాత పంజాబ్ పోలీసులు అమృతపాల్‌పై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కూడా విధించారు.

    ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత అమృతపాల్‌ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి అసోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. అమృతపాల్‌పై అనేక కేసులు నమోదయ్యాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    పంజాబ్

    Punjab: గురుద్వారాలో కాల్పులు.. పోలీసు అధికారి మృతి.. ఐదుగురికి గాయాలు  భారతదేశం
    IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే  ఐపీఎల్
    Lorry driver: తాగి రైలు పట్టాలపై లారీని నిలిపిన డ్రైవర్.. తర్వాత ఏమైందంటే? ఇండియా
    Punjab: లూథియానాలోని ఫర్నిచర్ ఫ్యాక్టరీ గోదాములో అగ్నిప్రమాదం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025