NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు 
    కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు 
    భారతదేశం

    కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 29, 2023 | 09:45 am 0 నిమి చదవండి
    కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు 
    దిల్లీసో నిరసన తెలిపిన రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ కొత్త పార్లమెంట్ భవనం వద్దకు నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను దిల్లీ పోలుసులు ఆదివారం అరెస్టు చేసిన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ర్యాలీకి నాయకత్వం వహించిన పలువురు రెజ్లర్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా పలువురు రెజ్లర్ల్‌పై కేసులు నమోదు చేసినట్లు దిల్లీ పోలుసులు తెలిపారు. కొంతమంది రెజ్లర్లు ఆదివారం రాత్రి జంతర్ మంతర్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అయితే వారికి అనుమతిని పోలీసులు నిరాకరించినట్లు వెల్లడించారు.

    దేశం నియంతృత్వంలోకి జారిపోయిందా?: వినేష్ ఫోగట్ 

    రెజ్లర్లపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌‌పై వినేష్ ఫోగట్ స్పందించారు. లైంగిక వేధింపుల విషయంలో బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి దిల్లీ పోలీసులు ఏడు రోజులు పడుతుందని, శాంతియుతంగా నిరసన చేపట్టినందుకు తమపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ఏడు గంటలు కూడా పట్టలేదన్నారు. దేశం నియంతృత్వంలోకి జారిపోయిందా? ప్రభుత్వం తమ ఆటగాళ్ల పట్ల ఎలా వ్యవహరిస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోందని వినేష్ ఫోగట్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో మండిపడ్డారు. పోలీసులు తనను కస్టడీకి తీసుకోవడంపై రెజ్లర్ భజరంగ్ పునియా కూడా స్పందించారు. పోలీసులు తమను కస్టడీలో ఉంచారని, కానీ ఏమీ చెప్పడం లేదన్నారు. బ్రిజ్ భూషణ్ జైల్లో ఉండాల్సింది బోయి, తమను జైల్లో ఎందుుకు పెట్టారని పునియా ప్రశ్నించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    దిల్లీ
    రెజ్లింగ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దిల్లీ

    కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం రెజ్లింగ్
    కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే లోక్‌సభ
    కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే నరేంద్ర మోదీ

    రెజ్లింగ్

    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ
    పునియా, ఫోగట్ నార్కో టెస్ట్ చేయించుకుంటే నేను కూడా రెడీ: ఆర్ఎఫ్ఐ చీఫ్ శరణ్ సింగ్  తాజా వార్తలు
    WWE మాజీ ప్రపంచ ఛాంపియన్ బిల్లీ గ్రహం కన్నుమూత ప్రపంచం
    బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు దిల్లీ

    తాజా వార్తలు

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 24మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కర్ణాటక
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు దిల్లీ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం  కేరళ
    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కర్ణాటక
    లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం  బ్రిటన్
    హైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమాన సర్వీసు; వచ్చే ఏడాది నుంచి ప్రారంభం  హైదరాబాద్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023