LOADING...
Anant Ambani: కొలంబియాలోని 80 నీటి ఏనుగులకు వంతారాలో ఆశ్రయం..
కొలంబియాలోని 80 నీటి ఏనుగులకు వంతారాలో ఆశ్రయం..

Anant Ambani: కొలంబియాలోని 80 నీటి ఏనుగులకు వంతారాలో ఆశ్రయం..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 28, 2026
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్యనిర్వాహక దర్శకుడు అనంత్ అంబానీ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తమ దేశంలో ఉన్న 80 నీటి ఏనుగులను హతమార్చాలని నిర్ణయించిన కొలంబియా ప్రభుత్వ ప్రకటనపై ఆయన స్పందించారు. ఆ జంతువులను చంపకుండా,వాటికి శాశ్వత ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు. గుజరాత్‌లోని తన జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి,అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కొలంబియా పర్యావరణ, సుస్థిర అభివృద్ధి శాఖకు అధికారికంగా వినతి పంపించారు. ప్రాణం ఉన్న ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని పేర్కొంటూ,నీటి ఏనుగులకు సురక్షితమైన వాతావరణం, ఆహారం, వైద్య సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

వివరాలు 

హిప్పోలను ఎందుకు చంపాలనుకున్నారు..?

తమ ప్రతిపాదనను పూర్తిగా పరిశీలించే వరకు హిప్పోలను హతమార్చే ఆలోచనను నిలిపివేయాలని కూడా కోరారు. త్వరలోనే పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనను అందజేస్తామని, ఇందుకోసం కొలంబియా అధికారులతో నేరుగా చర్చలు జరపనున్నట్లు తెలిపారు. కొలంబియాలోని మగ్దలీనా నది పరివాహక ప్రాంతంలో నీటి ఏనుగుల సంఖ్య అధికంగా పెరగడంతో అక్కడి జీవవైవిధ్యం దెబ్బతింటోంది. పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడంతో పాటు, స్థానిక ప్రజలకు కూడా ప్రమాదం ఏర్పడుతోంది. అందువల్ల వాటి సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది. ఈ జంతువులు ఆ దేశానికి చెందినవి కావు. గతంలో మాదకద్రవ్యాల వ్యాపారి పాబ్లో ఎస్కోబార్ ఆఫ్రికా నుంచి వాటిని తెచ్చి తన ప్రైవేటు జంతుప్రదర్శనశాలలో ఉంచాడు.

వివరాలు 

వంతారా గురించి

తర్వాత అతని అరెస్టుతో అవి నిర్లక్ష్యానికి గురై,నది పరిసర ప్రాంతాల్లో విస్తరించాయి. కాలక్రమంలో వాటి సంఖ్య పెరిగి,ఆహారం కోసం జనావాస ప్రాంతాలకు చేరుకున్నాయి. ఇవి చేపలు, తాబేళ్లపై దాడులు చేయడంతో పాటు,కొన్నిసార్లు మనుషులపై కూడా దాడి చేస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈపరిస్థితుల్లో వాటి జనాభాను నియంత్రించాలనే ఉద్దేశంతో 80హిప్పోలను హతమార్చాలని ప్రతిపాదించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత్ అంబానీ నిర్వహిస్తున్న వన్యప్రాణి పునరావాస కేంద్రం వంతారా. గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్ ప్రాంతంలో వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో రెండు వేలకుపైగా జంతువులు సంరక్షణ పొందుతున్నాయి. వేటగాళ్ల బారిన పడి గాయపడినవి లేదా నిరాదరణకు గురైన జంతువులను రక్షించి,వాటికి ప్రత్యేక వైద్య సేవలు,సంరక్షణ,పునరావాస సదుపాయాలు అందించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.

Advertisement