NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్
    భారతదేశం

    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్

    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 21, 2023, 03:52 pm 0 నిమి చదవండి
    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్
    జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్

    పాఠశాల విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న గోరుముద్ద ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. రాగి జావ కోసం ప్రభుత్వం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచ్చించి పిల్లలకు పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థుల మేథో వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించనున్నట్లు జగన్ చెప్పారు. బడి మానేసిన పిల్లల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.

    గోరుముద్ద కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు: సీఎం జగన్

    6వ తరగతి నుంచి ప్రతి తరగతిలో డిజిటల్ బోధనతో ప్రభుత్వ పాఠశాలలను డిజిటలీకరించామని, ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చామని సీఎం జగన్ చెప్పారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనలతో విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తున్నామన్నారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తున్నామని, సత్యసాయి ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నేటి నుంచి గోరుముద్దలో రాగి జావను కలుపుతున్నామని సీఎం జగన్ తెలిపారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    తాజా వార్తలు

    ఆంధ్రప్రదేశ్

    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  కర్నూలు
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    అరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే  భారతదేశం
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్
    మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

    పర్యాటకులకు అలర్ట్: నేడు, రేపు పాపికొండల విహార యాత్ర రద్దు  ఆంధ్రప్రదేశ్
    వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత ఆంధ్రప్రదేశ్
    'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు తెలంగాణ
    టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు  తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    తాజా వార్తలు

    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  దిల్లీ
    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు  తెలంగాణ
    PWC India report: 2026-27 నాటికి 90శాతం యూపీఐ చెల్లింపులే చెల్లింపు

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023