NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?
    భారతదేశం

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 20, 2023, 04:41 pm 1 నిమి చదవండి
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వే సంస్థలే జగన్‌ను తప్పుదారి పట్టించినట్లు ప్రచారం జరుగుతోంది.

    ఆంధ్రప్రదేశ్‌లోని 3 గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర(శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం), తూర్పు రాయలసీమ(ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు), పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు)పట్టభద్రల స్థానాల్లో వైసీపీ అనూహ్య పరాభవం ఎదురైంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి పాపం సర్వే సంస్థలదనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ కూడా అదే ఆలోచనలో ఉన్నారట. 2019 ఎన్నికల సమయంలో నియమించుకున్న సర్వే సంస్థలను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ కొనసాగిస్తున్నారు. అవి రాష్ట్రంలో వచ్చిన స్థానిక, ఉప ఎన్నికలతో పాటు సంక్షేమ పథకాల విషయంలో ప్రజల నాడిని ఎప్పుటికప్పుడు జగన్ నివేదిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇచ్చిన అన్నిరిపోర్టులను ఆయా సర్వే సంస్థలు ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చినట్లు సమాచారం. రిపోర్టులకు అనుగునంగానే అన్ని ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది.

    నిజమైన ఓటర్ల నుంచి శాంపిల్స్ తీసుకోలేదా?

    ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా సర్వే సంస్థలు రిపోర్టులు ఇచ్చినట్లు తెలుస్తోంది. 65శాతం ఓట్లతో వైసీపీ గెలుస్తుందని సర్వే సంస్థలు చెప్పడంతో, ఆ రిపోర్టులను చూసిన జగన్, ఇంట్లో ఉండి కూడా గెలువచ్చని అనుకుంటున్నట్లు సమాచారం. విచిత్రమేమంటే ఎగ్జిట్‌పోల్స్ కూడా 65శాతం ఓట్లతో వైసీపీ గెలుస్తుందని అంచనా వేశాయి. ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. సర్వే సంస్థలను గుడ్డిగా నమ్మడం వల్లే, పార్టీకీ కంచుకోటగా చెప్పుకునే రాయలసీమ జిల్లాల్లో జగన్ ఓటమి పాలైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజమైన ఓటర్ల నుంచి శాంపిల్స్ తీసుకోకుండా, తూతూమంత్రంగా సర్వే చేసి, జగన్‌ను తప్పుదారి సర్వే సంస్థలు పక్కదారి పట్టించినట్లు వైసీపీ నేతలే ఆరోపిస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    ఆంధ్రప్రదేశ్
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్

    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  కర్నూలు
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    అరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే  భారతదేశం
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు  ప్రకాశం జిల్లా
    రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్  కడప
    ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు  ఆంధ్రప్రదేశ్
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్

    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    'ప్రత్యేక హోదా కోసం పోరాడండి'; ఏపీ మంత్రులకు హరీష్ రావు కౌంటర్  తన్నీరు హరీష్ రావు
    వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్
    మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023