NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?
    తదుపరి వార్తా కథనం
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి

    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?

    వ్రాసిన వారు Stalin
    Mar 18, 2023
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాంధ్ర(విశాఖపట్నం, శ్రీకాకులం, విజయనగరం) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు.

    ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఈ చిరంజీవి ఎవరు? ఆయన ఇది వరకు ఏం చేసేవారు? ఆయన కుటుంబ నేపథ్యంం ఏంటి?

    ఉత్తరాంధ్రలో ఎంతో బలంగా ఉన్న వైసీపీ బలపర్చిన సీతంరాజు సుధాకర్‌పై గెలుపొందిన వేపాడ చిరంజీవి రావు పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా వినిపిస్తోంది.

    తొలి ప్రాధాన్యతో ఓట్ల లెక్కింపు ముందంజలో ఉన్న వేపాడ చిరంజీవిరావుకు విజయానికి కావాల్సిన ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చింది.

    రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయానికి అవసరమైన మెజార్టీ రావడంతో తొలిసారి మండలిలో అడుగు పెట్టబోతున్నారు.

    ఉత్తరాంధ్ర

    వేపాడ చిరంజీవిరావు కుటుంబ, వృత్తి నేపథ్యం

    చిరంజీవి రావు అర్థశాస్త్ర అధ్యాపకుడు. ఆయనను అందరకీ ఎకానమీ చిరంజీవిగా సుప్రసిద్ధులు.

    అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడికి చెందిన చిరంజీవి 1972లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఏయూ నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

    1996 డీఎస్సీలో ఎస్జీటీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి, ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్, జూనియర్, డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేశారు. ఇటీవలే వీఆర్ఎస్ తీసుకున్నారు.

    చిరంజీవి భార్య నివేదిత కూడా విశాఖలోని వీఎస్ కృష్ణ డిగ్రీ కలాశాలలో అధ్యపకురాలిగా పని చేస్తున్నారు.

    భారతదేశ ఆర్థిక వ్యవస్థపై చిరంజీవి ఆరు పుస్తకాలు రాశారు.

    విశాఖ ఎంవీపీ కాలనీలోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్‌లో గ్రూప్స్‌తో పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తుంటారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎమ్మెల్సీ
    ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్టణం
    శ్రీకాకుళం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఎమ్మెల్సీ

    టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎన్నికలు

    ఆంధ్రప్రదేశ్

    బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా; టీడీపీలోకా? జనసేనలోకా? బీజేపీ
    ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత వై.ఎస్.జగన్
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్
    ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా? వై.ఎస్.జగన్

    విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ

    శ్రీకాకుళం

    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025