English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్
    తదుపరి వార్తా కథనం
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్
    ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్; ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం

    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్

    వ్రాసిన వారు Stalin
    Mar 17, 2023
    05:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలన పునరుద్ఘాటించారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వంటి అంశాలపై చర్చించారు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అనేక ద్వైపాక్షిక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ప్రధానికి దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రం స్వావలంబన దిశగా సాగుతుందని పీఎంకు జగన్ వివరించారు.

    పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీతో చర్చించిన ముఖ్యమంత్రి, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని కోరారు.

    ఆంధ్రప్రదేశ్

    పోలవరం పూర్తి చేసేందుకు రూ.10,000 కోట్లు ఇవ్వండి: సీఎం జగన్

    పోలవరం ప్రాజెక్టుకు తమ రాష్ట్రం ఇప్పటికే దాదాపు రూ.2,900కోట్లు ఖర్చు చేసిందని, వాటిని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు రీయింబర్స్ చేయలేదని ప్రధానికి జగన్ మోహన్ రెడ్డి వివరించారు.

    ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు తాత్కాలిక ప్రాతిపదికన రూ.10,000 కోట్ల నిధులు ఇవ్వాలని కోరారు.

    రూ.55,548.87కోట్లుగా నిర్ణయించిన పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ముందస్తుగా ఆమోదించాలని మోదీకి జగన్ విజ్ఞప్తి చేశారు.

    ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన అంశాలపై చర్చించి, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దక్షిణాది రాష్ట్రంలో ఎక్కువ మంది లబ్ధిదారులను చేర్చాలని, మరో 12 మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలపాలని, రాష్ట్ర ఆధీనంలోని ఆంధ్రప్రదేశ్ మినరల్‌కు గనులను కేటాయించాలని సీఎం జగన్ ప్రధానికి కోరినట్లు ఏపీ సీఎంవో వర్గాలు తెలిపాయి.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్
    ముఖ్యమంత్రి
    ప్రధాన మంత్రి

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం విశాఖపట్టణం
    బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా; టీడీపీలోకా? జనసేనలోకా? బీజేపీ
    ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత వై.ఎస్.జగన్
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్

    ముఖ్యమంత్రి

    వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం జార్ఖండ్

    ప్రధాన మంత్రి

    బీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు
    'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్ రాహుల్ గాంధీ
    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    'మిల్లెట్స్‌తో ట్రై చేయండి', వంట చేయడంలో 'బిల్ గేట్స్ 'కు ప్రధాని మోదీ టిప్ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025