NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు
    దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు

    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 16, 2023
    03:27 pm
    దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు
    వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు

    దిల్లీ మద్యం పాలసీ కేసు విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఈ కేసులో విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు పంపింది. దిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ప్రస్తుతం మాగుంట రాఘవ తీహారు జైలులో ఉన్నారు.

    2/2

    ఈనెల 18న ఈడీ ఎదుట హాజరు‌కానున్న మాగుంట

    దిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ నిమిత్తం ఈనెల 18న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. దిల్లీలో మద్యం వ్యాపారానికి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిశారని ఈడీ పేర్కొంది. ఈడీ ఇప్పటి వరకు ఈ కేసులో రెండు ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు అరెస్టు అయ్యారు. ఇదిలా ఉంటే.. గురువారం విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరు కాకపోవడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆంధ్రప్రదేశ్
    దిల్లీ
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    ఎంపీ

    ఆంధ్రప్రదేశ్

    AP Budget Hghlights: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2023-24 హైలెట్స్; వార్షిక పద్దు రూ.2,79,279కోట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్ ముంబై
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ

    దిల్లీ

    కవితకు మళ్లీ నోటీసులు పంపిన ఈడీ; ఈనెల 20న విచారణ కల్వకుంట్ల కవిత
    జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు మనీష్ సిసోడియా
    చివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ కల్వకుంట్ల కవిత
    'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ కల్వకుంట్ల కవిత
    దిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత కల్వకుంట్ల కవిత
    రేపు కవిత విచారణ; ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర పిళ్లై కల్వకుంట్ల కవిత
    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు లాలూ ప్రసాద్ యాదవ్

    ఎంపీ

    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు రాహుల్ గాంధీ
    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు ఉత్తర్‌ప్రదేశ్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023