Supreme Court-Sand Mining: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..అక్రమ ఇసుక తవ్వకాలు తక్షణమే నిలిపివేయండి: సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme Court)లో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై (Sand Mining) సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది . అనుమతులు లేని తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పును కచ్చితంగా అమలు చేయాలని, అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వచ్చే నెల 9 లోపు ఈ అంశంపై అఫిడవిట్ ను దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున అఫిడవిట్ దాఖలుకు ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది సమయం కావాలని కోరారు.
ఎన్నికల కంటే పర్యావరణమే ముఖ్యం: సుప్రీం కోర్టు
అయితే ఈ అభ్యర్థులను సుప్రీంకోర్టు చూసింది ఎన్నికల కంటే పర్యావరణ అంశాలే ముఖ్యమని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది.