Loading...
Paper leak protest: మరో పేపర్ లీక్ కలకలం.. ఝార్ఖండ్‌లో ఉద్ధృతమైన విద్యార్థుల ఆందోళనలు
మరో పేపర్ లీక్ కలకలం.. ఝార్ఖండ్‌లో ఉద్ధృతమైన విద్యార్థుల ఆందోళనలు

Paper leak protest: మరో పేపర్ లీక్ కలకలం.. ఝార్ఖండ్‌లో ఉద్ధృతమైన విద్యార్థుల ఆందోళనలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్ పేపర్ లీక్ నిరసనలతో కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని దిల్లీ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు ఝార్ఖండ్‌లోనూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ రాజధాని రాంచీలో ప్రారంభమైన విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. జేపీఎస్‌సీ నియామక పరీక్షను రద్దు చేయాలని, పేపర్ లీక్ ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, అలాగే నియామక వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

వివరాలు

విద్యార్థి నాయకుడి నిరాహార దీక్ష

తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుతూ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆదివారం జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరాహార దీక్ష ప్రారంభించారు.

ఈ ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కూడా మద్దతు ప్రకటించింది. ఆందోళనకారులను ఉద్దేశించి మహతో మాట్లాడుతూ.. జేపీఎస్‌సీ పరీక్ష ఫలితాలు గత నెల విడుదలయ్యాయి.

అనంతరం ముఖ్యమంత్రిని కలిసి పేపర్ లీక్‌కు సంబంధించిన ఆధారాలను సమర్పించాం. కొన్నివారాలుగా నిరసనలు కొనసాగుతున్నా ప్రభుత్వం, జేపీఎస్‌సీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి.

దీంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు, మా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాను. నిందితులకు శిక్ష పడటమే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు.

వివరాలు

పేపర్ లీక్‌, అవకతవకలపై ఆగ్రహం

పేపర్ లీక్ ఆరోపణలు, నియామక ప్రక్రియలో అవకతవకలు, పాలనాపరమైన లోపాల కారణంగా తమ భవిష్యత్తు దెబ్బతింటోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఈ కారణంగానే కొన్ని వారాల క్రితం నుంచే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆందోళనకారుల ప్రకారం.. జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని విమర్శించారు.

ఈ వ్యవహారంలో సంస్థాగత మార్పులు తీసుకురావాలని కూడా వారు డిమాండ్ చేశారు

ADVERTISEMENT

వివరాలు

సీజేపీ మద్దతు

విద్యార్థుల ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మద్దతు ప్రకటించింది.

పార్టీ నేత అభిజీత్ దీప్కే ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ..నిరసనకారులతో మేము మాట్లాడాం. వారికి మా పూర్తి అండ ఉంటుంది.

వారి అన్ని డిమాండ్లకు మా మద్దతు కొనసాగుతుందని వెల్లడించారు.

ADVERTISEMENT