NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు
    భారతదేశం

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 26, 2022, 06:13 pm 0 నిమి చదవండి
    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు
    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఇద్దరికి పాజిటివ్

    అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం బిహార్ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆ ఇద్దరు ప్రయాణికుల్లో ఒకరు మహిళ కాగా.. మరొకరు పురుషుడు. మహిళా ప్రయాణికురాలు బ్రిటన్ నుంచి కౌలాలంపూర్ మీదుగా కోల్‌కతాకు వచ్చారు. బిహార్ నివాసి అయిన మరో మరో ప్రయాణికుడు.. దుబాయ్ నుంచి వచ్చాడు. వైరస్ నిర్ధారణ అనంతరం ఆ ఇద్దరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పంపినట్లు కోల్‌కతా విమానాశ్రయ వర్గాలు చెప్పాయి. బ్రిటన్ దేశస్థురాలును ప్రభుత్వ నిర్వహణలోని హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

    మయన్మార్ నుంచి వచ్చిన మరో నలుగురికి?

    ఆదివారం పాజిటివ్‌గా తేలిన నలుగురు విదేశీయుల్లో ముగ్గురు థాయ్‌లాండ్‌కు చెందినవారు కాగా.. ఒకరు మయన్మార్‌ వాసి. వీరి నమూనాలను కూడా ఆదివారం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. దిల్లీ విమానాశ్రయంలో కూడా మయన్మార్ నుంచి వచ్చిన నలుగురికి పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. గత‌వారం కూడా యూకేకు చెందిన 60 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా తెలింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేయడానికి ముందే ఈ కేసును గుర్తించడం గమనార్హం. కేంద్రం ఆదేశాలతో విమానాశ్రయాల్లో స్ర్కీనింగ్ పరీక్షలు చేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో.. ఈ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కోవిడ్
    బిహార్
    పశ్చిమ బెంగాల్

    తాజా

    జాతీయ చియాగింజల దినోత్సవం: చియాగింజలు జుట్టుకు చర్మానికి చేసే మేలు చర్మ సంరక్షణ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్
    భారత్‌పై వన్డే సిరీస్ నెగ్గాక.. వార్నర్ సెలబ్రేషన్స్.. తగ్గేదేలా ఆస్ట్రేలియా
    2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్ భారతదేశం

    కోవిడ్

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నరేంద్ర మోదీ
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి కరోనా కొత్త మార్గదర్శకాలు
    దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన భారతదేశం
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర

    బిహార్

    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ నితీష్ కుమార్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు తేజస్వీ యాదవ్
    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు లాలూ ప్రసాద్ యాదవ్
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం లాలూ ప్రసాద్ యాదవ్

    పశ్చిమ బెంగాల్

    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు ట్విట్టర్
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G ఎయిర్ టెల్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023