NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చంద్రబాబుకే ఎందుకు ఇలా జరుగుతోంది? మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మృతి
    తదుపరి వార్తా కథనం
    చంద్రబాబుకే ఎందుకు ఇలా జరుగుతోంది? మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మృతి
    చంద్రబాబు కార్యక్రమంలో మరోసారి తొక్కిసలాట

    చంద్రబాబుకే ఎందుకు ఇలా జరుగుతోంది? మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మృతి

    వ్రాసిన వారు Stalin
    Jan 02, 2023
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చంద్రబాబు సభల్లో వరుస విషాదాలు టీడీపీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కొత్త ఏడాదిలో మొదటి రోజు గుంటూరు వికాస్‌నగర్‌లో జరిగిన తొక్కిసలాటలో మరో ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురూ మహిళలే. ఇటీవల కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 8మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

    నూతన సంవత్సరం వేళ.. వికాస్‌నగర్‌లోని ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. చంద్రాబాబు కార్యక్రమాన్ని ప్రారంభించి.. ప్రసంగించి వెళ్లిపోయారు. అనంతరం తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోగా.. మరికొంత మంది గాయపడ్డారు.

    చంద్రబాబు

    ప్రమాదంపై ఎస్పీ వివరణ..

    టీడీపీ కార్యక్రమాల్లో జరుగుతున్నఈ వరుస ప్రమాదాలతో చంద్రబాబు అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. తన సభల్లో ఇలా ఎందుకు జరుగుతుందనే బాధలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఇక మీదట పార్టీ కార్యక్రమాలు నిర్వహించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ద్వితీయ శ్రేణి నాయకులను చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.

    అయితే గుంటూరు ప్రమాదంపై పోలీసుల స్పందించారు. ఎక్కువ సేపు క్యూలో నిలబెట్టడం వల్ల.. జనం ఒక్కసారిగా రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. తాము అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే మొదటి కౌంటర్ వద్దే ఈ తొక్కిసలాట జరిగనట్లు వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్

    చంద్రబాబు నాయుడు

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు భారతదేశం
    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ భారతదేశం
    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ వై.ఎస్.జగన్
    2022లో మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులు ఇవే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025