NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్
    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్

    AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 06, 2025
    01:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

    ఈ క్రమంలో, 2019లో నామినేటెడ్ పోస్టులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న చట్టాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు, అందులో ఉన్న లోటుపాట్లను సవరించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది.

    అదేవిధంగా, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

    ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్ 2025కి కేబినెట్ అనుమతి ఇచ్చింది.

    పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణ ప్రతిపాదనపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది.

    గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్దీకరణకు సంబంధించి కూడా కేబినెట్ ప్రత్యేక ప్రతిపాదనలు చేసింది.

    వివరాలు 

    టీటీడీలో పోటులో పని చేసే వర్కర్లను పదోన్నతి

    ప్రాజెక్టులు మినహా ఏపీ సీఆర్డీఏ చేపట్టే ఇతర పనులకు టెండర్ల పరిమితి పెంపు కోసం నిబంధనల సవరణపై కేబినెట్ ప్రతిపాదన చేసింది.

    అదనంగా, టీటీడీలో పోటులో పని చేసే వర్కర్లను సూపర్ వైజర్లుగా పదోన్నతి కల్పించేందుకు మంత్రివర్గం చర్చించింది.

    వీరిని సీనియర్ అసిస్టెంట్ కేడర్‌కు ప్రమోషన్ ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చింది.

    స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టేందుకు కేబినెట్ చర్చించగా, తిరుపతి జిల్లాలోని చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌లో భూములు కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరానికి 8 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

    వివరాలు 

     రిటైల్ ఎక్సైజ్ టాక్స్ సవరణ ప్రతిపాదనకు అంగీకారం 

    ఇక, తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామం, కోట మండలంలోని కొత్తపట్నం గ్రామ పరిధిలో భూముల పరిహార పెంపు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    అదేవిధంగా, భారత్‌లో తయారైన విదేశీ మద్యం, బీర్, ఎఫ్‌ఎల్ స్పిరిట్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ సవరణ ప్రతిపాదనకు కూడా ఏపీ కేబినెట్ అంగీకారం తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Shashi Tharoor: చైనా ఎంత కాపాడినా.. టీఆర్‌ఎఫ్‌ను వదిలిపెట్టం: శశిథరూర్‌ శశిథరూర్
    Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత.. పంజాబ్
    Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు! కర్ణాటక
    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్

    ఆంధ్రప్రదేశ్

    AP Liquor Shops: గీత కార్మికులకు 335 మద్యం షాపులు కేటాయింపు.. నోటిఫికేషన్ జారీ భారతదేశం
    One year BEd: వన్‌ ఇయర్‌ బీఈడీ తిరిగి ప్రవేశపెట్టే అవకాశాలు.. పూర్తి వివరాలివే భారతదేశం
    KRMB: ఏపీ-తెలంగాణ మధ్య పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు : కృష్ణా బోర్డు తెలంగాణ
    AP News: బుగ్గ-గిద్దలూరు, వినుకొండ-గుంటూరు మధ్య నాలుగు వరుసల హైవే.. ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ఆమోదం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025