AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
ఈ క్రమంలో, 2019లో నామినేటెడ్ పోస్టులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న చట్టాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు, అందులో ఉన్న లోటుపాట్లను సవరించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది.
అదేవిధంగా, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్ 2025కి కేబినెట్ అనుమతి ఇచ్చింది.
పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణ ప్రతిపాదనపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది.
గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్దీకరణకు సంబంధించి కూడా కేబినెట్ ప్రత్యేక ప్రతిపాదనలు చేసింది.
వివరాలు
టీటీడీలో పోటులో పని చేసే వర్కర్లను పదోన్నతి
ప్రాజెక్టులు మినహా ఏపీ సీఆర్డీఏ చేపట్టే ఇతర పనులకు టెండర్ల పరిమితి పెంపు కోసం నిబంధనల సవరణపై కేబినెట్ ప్రతిపాదన చేసింది.
అదనంగా, టీటీడీలో పోటులో పని చేసే వర్కర్లను సూపర్ వైజర్లుగా పదోన్నతి కల్పించేందుకు మంత్రివర్గం చర్చించింది.
వీరిని సీనియర్ అసిస్టెంట్ కేడర్కు ప్రమోషన్ ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చింది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్కు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టేందుకు కేబినెట్ చర్చించగా, తిరుపతి జిల్లాలోని చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లో భూములు కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరానికి 8 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
వివరాలు
రిటైల్ ఎక్సైజ్ టాక్స్ సవరణ ప్రతిపాదనకు అంగీకారం
ఇక, తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామం, కోట మండలంలోని కొత్తపట్నం గ్రామ పరిధిలో భూముల పరిహార పెంపు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదేవిధంగా, భారత్లో తయారైన విదేశీ మద్యం, బీర్, ఎఫ్ఎల్ స్పిరిట్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ సవరణ ప్రతిపాదనకు కూడా ఏపీ కేబినెట్ అంగీకారం తెలిపింది.