Loading...
NTA Director: ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేశ్‌ నియామకం
ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేశ్‌ నియామకం

NTA Director: ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేశ్‌ నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

NEET, JEE వంటి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలకు బాధ్యత వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్‌ను ఎన్‌టీఏ డైరెక్టర్‌గా నియమించింది. ఆయన ఐదేళ్లపాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ (DoPT) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 

ఇద్దరు డైరెక్టర్లు, ఒక జాయింట్‌ డైరెక్టర్

ప్రసన్న వెంకటేశ్‌తో పాటు 2012 బ్యాచ్‌ ఏజీఎంయూటీ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి రవి కుమార్‌ సింగ్‌ను కూడా ఎన్‌టీఏ డైరెక్టర్‌గా కేంద్రం నియమించింది.

సెంట్రల్‌ స్టాఫింగ్‌ స్కీమ్‌ కింద వీరిద్దరూ డైరెక్టర్‌ హోదాలో సేవలు అందించనున్నారు.

బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఐదేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు.. ఏది ముందుగా వస్తే అప్పటివరకు వారు పదవుల్లో కొనసాగుతారు.

ఇక 2016 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (కస్టమ్స్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌) అధికారి అమిత్‌ సాందారియాను ఎన్‌టీఏ జాయింట్‌ డైరెక్టర్‌గా నియమించారు.

డిప్యూటీ సెక్రటరీ స్థాయి హోదాలో ఆయన నాలుగేళ్లపాటు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

వివరాలు 

ఏపీలో కీలక బాధ్యతలు

ప్రసన్న వెంకటేశ్‌ ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక పదవుల్లో పనిచేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌గా, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా ఆయన సేవలు అందించారు.

మరోవైపు రవి కుమార్‌ సింగ్‌ను కేంద్ర డిప్యుటేషన్‌కు పంపించాలని కేంద్ర హోంశాఖ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆయనకు ఎన్‌టీఏ డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు.

వివాదాల నేపథ్యంలో ఎన్‌టీఏ ప్రక్షాళన

NEET పేపర్‌ లీక్‌, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై గతంలో ఎన్‌టీఏ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

దీంతో సంస్థ పనితీరును మెరుగుపరిచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేపట్టింది.

ఇందులో భాగంగా కొందరిని బాధ్యతల నుంచి తప్పించింది. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు డైరెక్టర్లు, ఒక జాయింట్‌ డైరెక్టర్‌ను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఎవరీ ప్రసన్న వెంకటేశ్‌?

వి. ప్రసన్న వెంకటేశ్‌ 2012 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి.

ఆయన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయంబత్తూరులో బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివారు.

ఐఏఎస్‌గా ఎంపికైన తర్వాత పాడేరు సబ్‌ కలెక్టర్‌గా తన పరిపాలనా ప్రస్థానాన్ని ప్రారంభించారు.

ఆ తర్వాత ఏపీ సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.

అలాగే పోర్ట్స్‌ డైరెక్టర్‌, కర్నూలు జాయింట్‌ కలెక్టర్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు.

ADVERTISEMENT

వివరాలు 

విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా..

2019లో విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రసన్న వెంకటేశ్‌.. నగర మౌలిక, పౌర సేవలపై ప్రత్యేక దృష్టి సారించారు.

పారిశుధ్యం, చెత్త నిర్వహణ, నీటి సరఫరా, ట్రాఫిక్‌ నియంత్రణ, నగరంలో పచ్చదనం పెంపు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

తర్వాత ఏలూరు జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2024 జూలై నుంచి ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (APSWREIS) కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

వివరాలు 

ఇక ఎన్‌టీఏలో కీలక బాధ్యతలు

తాజా నియామకంతో ప్రసన్న వెంకటేశ్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ డైరెక్టర్‌గా ఆయన ఐదేళ్ల కాలానికి నియమితులయ్యారు.

దేశవ్యాప్తంగా NEET, JEE వంటి ముఖ్యమైన పరీక్షల నిర్వహణలో ఎన్‌టీఏ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఇటీవలి కాలంలో పరీక్షల నిర్వహణపై వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్న సంస్థకు ఇప్పుడు రాష్ట్ర, జిల్లా స్థాయి పరిపాలనలో అనుభవం ఉన్న ప్రసన్న వెంకటేశ్‌ డైరెక్టర్‌గా నియమితులు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT