NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: రాష్ట్రంలో శాంతి భద్రతలకి పోలీసు వ్యవస్తే కీలకం.. అందుకే ప్రక్షాళన.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: రాష్ట్రంలో శాంతి భద్రతలకి పోలీసు వ్యవస్తే కీలకం.. అందుకే ప్రక్షాళన.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
    రాష్ట్రంలో శాంతి భద్రతలకి పోలీసు వ్యవస్తే కీలకం..

    CM Chandrababu: రాష్ట్రంలో శాంతి భద్రతలకి పోలీసు వ్యవస్తే కీలకం.. అందుకే ప్రక్షాళన.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 21, 2024
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత కీలకమని, టూరిజం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు.

    నాలెడ్జ్ ఎకానమీకి రాష్ట్రం చిరునామా కావాలంటే శాంతి భద్రతలు కీలకమని ఆయన చెప్పారు.

    పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, చట్టాన్ని చేతికి తీసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    పోలీసు వ్యవస్థకు గౌరవం ఇవ్వడం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు.

    వివరాలు 

    లా అండ్ ఆర్డర్ పటిష్ఠంగా అమలు

    అమరావతిలో 5 ఎకరాల భూమిని పోలీసు మార్టియర్స్ డే కోసం కేటాయిస్తున్నట్లు తెలిపారు.

    సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. తుళ్లూరులో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ స్థాపనతో పాటు, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని కూడా రాష్ట్రానికి తీసుకురాబోతున్నట్లు తెలిపారు.

    రాష్ట్రంలో ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ (ఈగల్)ను ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు.

    రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

    అమ్మాయిలపై దాడులు చేయాలనుకుంటే దానికే ఆఖరి రోజు అనే భయం ఏర్పడాల్సిన అవసరముందన్నారు.

    డ్రగ్స్ పై అవగాహన కలిగించేందుకు పెద్ద ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమాజంలో చైతన్యం తీసుకురావడానికి లా అండ్ ఆర్డర్ పటిష్ఠంగా అమలు చేస్తామని చెప్పారు.

    వివరాలు 

    ల్యాండ్ గ్రాబింగ్‌ చేయించిన వారిని ప్రత్యేక కోర్టుల ద్వారా వెంటనే శిక్ష 

    ల్యాండ్ గ్రాబింగ్‌పై కేసులు వస్తే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

    ల్యాండ్ గ్రాబింగ్‌ చేయించిన వారిని ప్రత్యేక కోర్టుల ద్వారా వెంటనే శిక్షించి, బాధితులకు పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

    విచారణ జిల్లా కలెక్టర్ అనుమతితో పకడ్బందీగా జరుగుతుందని, డీఎస్పీ స్థాయి పై అధికారి దీనిని పరిశీలిస్తారని వివరించారు.

    పీడీ యాక్ట్‌కు పదును పెట్టామన్నారు. తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని పీడీ యాక్ట్‌లను పరిశీలించినట్లు చంద్రబాబు తెలిపారు.

    సైబర్ క్రైమ్ నేరస్తులను కూడా పీడీ యాక్ట్ పరిధిలోకి చేర్చామని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: 'ఏపీ-2047 విజన్' కోసం ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు  నరేంద్ర మోదీ
    Chandrababu: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ.. నితిన్ గడ్కరీ
    Chandrababu: దిల్లీ పర్యటనలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసిన చంద్రబాబు దిల్లీ
    Chandrababu Naidu: 'ఆధునికాంధ్ర కోసం మా ప్రయాణం'.. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025