NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఝలక్ ఇచ్చిన స్టాఫ్.. పేషీ సిబ్బందికి 8 నెలలుగా జీతాల్లేవ్
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఝలక్ ఇచ్చిన స్టాఫ్.. పేషీ సిబ్బందికి 8 నెలలుగా జీతాల్లేవ్
    ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఝలక్ ఇచ్చిన స్టాఫ్.. పేషీ సిబ్బందికి 8 నెలలుగా జీతాల్లేవ్

    ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఝలక్ ఇచ్చిన స్టాఫ్.. పేషీ సిబ్బందికి 8 నెలలుగా జీతాల్లేవ్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 12, 2023
    05:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ లేటుగా మాత్రమే వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎనిమిది నెలలుగా అసలు జీతాల ఊసే లేదనే విషయం తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం.

    అయితే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేషీలో గత నవంబర్ నుంచి ఉద్యోగులకు జీతాలే లేవు. దీంతో చేసేది లేక ఉద్యోగులు సదరు పేషీకి తాళం వేసి ఎంచక్కా ఊరికి వెళ్లిపోయారు.

    సచివాలయంలోని చెల్లుబోయిన పేషీలో ఏడుగురు సిబ్బంది పని చేస్తున్నారు. అందులో అటెండర్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరికి కాపు కార్పోరేషన్, బీసీ కార్పోరేషన్లు నుంచి జీతాలు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

    DETAILS

    ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేషీలో 8 నెలలుగా నో శాలరీస్ 

    సచివాలయంలో పనిచేస్తున్న వారంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే. వీరికి కేవలం ఒకటి, రెండు నెలల జీతం కాదు, దాదాపు 8 నెలల వేతనం రావాల్సి ఉంది.

    ఇప్పటికే జీతాల పరిష్కారంపై అటు మంత్రికి, ఇటు ఓఎస్డీ అధికారికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా వినిపించుకోవట్లేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.

    సదరు మంత్రి పేషీలో గతేడాది నుంచే ఎవరికీ జీతాలు రావడం లేదట. ఇంకా మౌనం వహిస్తే జీతాలనూ ఎగ్గొట్టినా ఆశ్చర్య లేదని భావించి వెంటనే ఛాంబర్ కు తాళాలు వేసేశామని సిబ్బంది అంటున్నారు.

    ఈ క్రమంలో సోమవారం మంత్రి ఛాంబర్ ను సిబ్బంది ఓపెన్ చేయలేదు. కారణమేమిటా అని తోటి ఉద్యోగులు ఆరా తీస్తే గానీ తెలియలేదు జీతాలు రాని సంగతి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభుత్వం
    ఆంధ్రప్రదేశ్
    ఉద్యోగులు

    తాజా

    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ

    ప్రభుత్వం

    CCI గూగుల్ పై వేసిన ₹1,337 కోట్ల పెనాల్టీని సమర్థించిన NCLAT గూగుల్
    ITR ఫైలింగ్ లో ఇటువంటి తప్పులు చేయకండి ఆర్ధిక వ్యవస్థ
    మాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు విమానం
    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం

    ఆంధ్రప్రదేశ్

    AP ICET-2023: రేపు ఏపీ ఐసెట్: నిమిషం ఆలస్యమైనా అనుమతించరు  తాజా వార్తలు
    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు  తెలంగాణ
    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఉద్యోగులు

    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO పెన్షన్
    వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంక్
    వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు ఉద్యోగుల తొలగింపు
    ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు పెన్షన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025