NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: ఖరీఫ్ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: ఖరీఫ్ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్
    ఖరీఫ్ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్

    Andhrapradesh: ఖరీఫ్ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 24, 2024
    04:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

    ఈ కొనుగోళ్లు వికేంద్రీకరణ విధానంలో జరుగుతాయని, రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

    వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ-పంట, ఈ కేవైసీ ద్వారా రైతుల, కౌలు రైతుల వివరాలు నమోదు చేసి, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సులభతరం చేయాలని సూచించింది.

    అలాగే, ఆధార్ అనుసంధానం ద్వారా ఇ-పంట, ఈ-కేవైసీ వ్యవస్థల ద్వారా రైతుల ఖాతాల్లోకి కొనుగోళ్ల చెల్లింపులు జరపాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి.

    వివరాలు 

    ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో రైస్ మిల్లర్లు వివరాలు నమోదు చేయాలి

    ధాన్యం కొనుగోళ్ల నిర్వహణకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఏపీ మార్క్ ఫెడ్ సంస్థలను నోడల్ సంస్థలుగా నియమిస్తూ జీవో జారీ చేసింది.

    రైస్ మిల్లర్లు కూడా ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్ధతు ధర ప్రకారం, కామన్ వెరైటీకి క్వింటాలుకు రూ.2300, గ్రేడ్ ఏ రకానికి రూ.2320 చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి.

    2024-25 ఖరీఫ్ సీజన్‌లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారని ప్రభుత్వం వెల్లడించింది.

    సేకరణతో పాటు మిల్లింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్లు, జేసీలకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఆంధ్రప్రదేశ్

    Vijayawada: విజయవాడలో వేగంగా పారిశుద్ధ్య పనులు   విజయవాడ వెస్ట్
    Prakasam barrage : ప్రకాశం, నాగార్జున సాగర్ వద్ద వరద హెచ్చరిక: భారీగా నీటి విడుదల ప్రకాశం జిల్లా
    MP Keshineni: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని ఏకగ్రీవంగా ఎన్నిక   క్రీడలు
    Chandrababu: ప్రకాశం బ్యారేజి వద్ద మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025