LOADING...
Nara Lokesh: పెట్టుబడుల రంగంలో 'ఏపీ' ముందు వరుస.. నారా లోకేశ్ సంచలన ట్వీట్
పెట్టుబడుల రంగంలో 'ఏపీ' ముందు వరుస.. నారా లోకేశ్ సంచలన ట్వీట్

Nara Lokesh: పెట్టుబడుల రంగంలో 'ఏపీ' ముందు వరుస.. నారా లోకేశ్ సంచలన ట్వీట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన తెలిపిన ప్రకారం భారతదేశం 2025-26 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌కి దక్కింది. అంటే ఏపీ ఇతర రాష్ట్రాలతో కేవలం పోటీ పడకపోయి, ముందస్తు స్థాయిలోనే దూసుకుపోతోంది. నారా లోకేష్ ఈ సందర్భంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇదే!' అని పేర్కొని, పెట్టుబడిదారులు ఏపీని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా,ఈ ట్వీట్ ప్రేరణకు కారణమయ్యింది ఫోర్బ్స్ ఇండియా, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) నుండి వెలువడిన తాజా గణాంకాలు.

Details

పారిశ్రామికాభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టం

దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఆకర్షించిన పెట్టుబడులను విశ్లేషించిన నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చిన పెట్టుబడుల నాలుగవ వంతు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చిందని తెలుస్తోంది. ప్రభుత్వం దీన్ని పారిశ్రామికాభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టంగా చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ఇన్వెస్టర్లలో గట్టిగానే నమ్మకాన్ని పెంచిందని నారా లోకేష్ చెప్పారు.

Details

అమరావతిలో క్వాంటం వ్యాలీ

గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం కేవలం అనుమతుల పరిమితిలో ఉండగా, ఇప్పుడు పరిశ్రమల స్థాపన వేగాన్ని కూడా జోడించడం వల్ల గూగుల్, రిలయన్స్, అదానీ, రాయ్‌డెన్ ఇన్ఫోటెక్ వంటి దిగ్గజ సంస్థలు వేల కోట్ల పెట్టుబడులతో ఏపీని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ముఖ్యంగా డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఐటీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడం ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. ప్రధాన మెగా ప్రాజెక్టులలో విశాఖపట్నంలో గూగుల్ AIడేటా హబ్, కర్నూలులో డ్రోన్ సిటీ, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఉన్నాయి, ఇవి రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దౌత్యం,నారా లోకేశ్ పారిశ్రామిక అనుకూల ప్రసంగాలు ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారని అధికారులు తెలిపారు.

Advertisement

Details

ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు అనేక రెట్లు ఎక్కువ

దేశ సగటు పెట్టుబడుల వృద్ధి రేటుకి పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు అనేక రెట్లు ఎక్కువ. నారా లోకేష్ ట్వీట్ ద్వారా మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా దక్షిణాదిలో పెట్టుబడుల రాజధానిగా ఎదుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద పెట్టుబడులను పొందడం ద్వారా లక్షలాది యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నారా లోకేశ్ చేసిన ట్వీట్ ఇదే

Advertisement