APJUDA Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్.. స్టైఫండ్ పెంపుపై ఆగస్టు 15 వరకు డెడ్లైన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు (జూడాలు) ఆందోళనకు సిద్ధమయ్యారు. తమ స్టైఫండ్ పెంచాలన్న డిమాండ్పై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆగస్టు 15లోగా తమ సమస్యపై స్పష్టమైన నిర్ణయం వెలువరించకపోతే.. ఆగస్టు 17 నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆగస్టు 15 వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు నిరసనలో భాగంగా ఆగస్టు 15వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. అదే సమయంలో తమ ఆందోళనలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర వైద్య సేవలను సైతం బహిష్కరించనున్నట్లు ప్రకటించారు.
వివరాలు
పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలి
రెసిడెంట్ డాక్టర్లకు సంబంధించిన న్యాయబద్ధమైన, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని APJUDA కోరింది.
ముఖ్యంగా స్టైఫండ్ పెంపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసింది.
తమ సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.
సమ్మె సమయంలో డీఆర్పీ,పెరిఫెరల్ పోస్టింగ్స్ నిలిపివేత
సమ్మె కాలంలో డీఆర్పీ (DRP), పెరిఫెరల్ పోస్టింగ్స్ను నిలిపివేయనున్నట్లు APJUDA వెల్లడించింది.
అయితే సాధారణ ఆరోగ్య సేవలకు సాధ్యమైనంత తక్కువ అంతరాయం కలిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
రోగులకు ఇబ్బందులు ఏర్పడకుండా అత్యవసర వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది.
వివరాలు
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఎమర్జెన్సీ సేవల బహిష్కరణ
అత్యవసర వైద్య సేవలకు సంబంధించి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిష్కరణ చేపట్టనున్నట్లు APJUDA ప్రకటించింది.
తమ డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయించిన గడువు ముగిసేలోపే స్పందించాలని కోరింది.
సమస్యను ఇకపై వాయిదా వేయకుండా స్టైఫండ్ పెంపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది.
చర్చలకు ఎప్పుడైనా సిద్ధమే
ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానం వస్తే గడువు ముగియకముందే ఎప్పుడైనా అర్థవంతమైన చర్చలకు సిద్ధంగా ఉన్నామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు.
తమ సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని APJUDA కోరింది.
వివరాలు
ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ
జూడాల స్టైఫండ్ పెంపు డిమాండ్పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ప్రస్తుతం వైద్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఆగస్టు 15లోగా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అన్నది కీలకంగా మారింది.
ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే ఆగస్టు 17 నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది.