NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఒకే ఫోటోతో 658 సిమ్‌కార్డులు జారీ.. దర్యాప్తునకు కేంద్ర సమాచార శాఖ ఆదేశాలు
    తదుపరి వార్తా కథనం
    ఒకే ఫోటోతో 658 సిమ్‌కార్డులు జారీ.. దర్యాప్తునకు కేంద్ర సమాచార శాఖ ఆదేశాలు
    ఒకే వ్యక్తికి 658 సిమ్‌కార్డులు జారీ

    ఒకే ఫోటోతో 658 సిమ్‌కార్డులు జారీ.. దర్యాప్తునకు కేంద్ర సమాచార శాఖ ఆదేశాలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 09, 2023
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుణదలలో ఒకే ఫొటోతో 658 సిమ్‌ కార్డులు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యునికేషన్స్‌ (DOT) ఈ మేరకు గుర్తించింది.

    అనంతరం ఈ విషయాన్ని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఈ అంశంపై విచారణ చేపట్టాలని సూర్యారావుపేట పోలీసులను కమిషనర్ కాంతిరాణా ఆదేశించారు.

    ఒకే ఫొటోతో ఓ నెట్‌వర్క్‌ సంస్థకు సంబంధించిన సుమారు 658 సిమ్‌ కార్డులను అమ్మినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సత్యనారాయణపురానికి చెందిన పోలుకొండ నవీన్‌ వీటిని తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు.

    మరోవైపు అజిత్‌సింగ్‌ నగర్‌, విస్సన్నపేట ఠాణాల పరిధిలోనూ ఇదే మాదిరిగా నకిలీ పత్రాలతో 150 చొప్పున సిమ్‌కార్డులను పొందినట్లు నిగ్గు తేల్చారు.

    DETAILS

    ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహకారంతో బట్టబయలు 

    సిమ్‌ కార్డ్ మోసాలను అరికట్టేందుకు భారత సమాచార శాఖ కృత్రిమ మేధస్సు(AI)తో పనిచేసే ఓ సాంకేతికతను ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగానే అక్రమ సిమ్ కార్డుల విషయం బహిర్గతమైంది.

    ASTR(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఫేసియల్‌ రికగ్నేషన్‌ పవర్డ్‌ సొల్యూషన్‌ ఫర్‌ టెలికాం సిమ్‌ సబ్‌స్క్రైబర్‌ వెరిఫికేషన్‌) సిమ్‌కార్డ్ మోసాలను గుర్తిస్తుంది. అనంతరం సంబంధిత నంబర్లను నిలుపదల(బ్లాక్) చేస్తోంది.

    టెలికాం ఆపరేటర్ల నుంచి సిమ్‌కార్డుదారుల ఫోటోలను తీసుకుని, డాట్ శాఖ ఏఐ సాఫ్ట్ వేర్ ద్వారా పోల్చి చూస్తుంది. దీంతో ఒకే ఫొటోతో పెద్ద ఎత్తున సిమ్‌లు తీసుకున్న సంగతి బట్టబయలైంది.

    నకిలీ పత్రాలతో తీసుకున్న సిమ్‌కార్డులు అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడితే విపరీత పరిణామాలు జరిగే ప్రమాదం ఉన్నట్లు డాట్ ఆందోళన వ్యక్తం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయవాడ సెంట్రల్
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం

    విజయవాడ సెంట్రల్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్ విద్యుత్
    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ

    ఆంధ్రప్రదేశ్

    IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక  ఐఎండీ
    ఏపీలో గిరిజన వ్యక్తిపై అమానుషం.. మద్యం మత్తులో నోట్లో మూత్రం ఒంగోలు
    టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్ తిరుమల తిరుపతి
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025