LOADING...
AP Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ.. ఇకపై వారు అనర్హులే!
ఇకపై వారు అనర్హులే!

AP Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ.. ఇకపై వారు అనర్హులే!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2025
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. వరుసగా మూడు నెలలపాటు రేషన్ సరుకులు తీసుకోకపోయినాలేదా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయకపోయినా వారి రేషన్ కార్డులు రద్దు కానున్నాయి. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందించడం, అలాగే అనర్హులైనవారిని తొలగించడం కోసం ఈ కఠినమైన నిబంధనలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

వివరాలు 

పంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు ఈ-కేవైసీ తప్పనిసరి 

రాష్ట్రంలో ప్రజలకు రేషన్ సరఫరాలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-కేవైసీని తప్పనిసరిగా అమలు చేశాయి. ఈ ప్రక్రియను పూర్తిచేయని రేషన్ కార్డు దారుల స్మార్ట్ కార్డులను అధికారులు నిలిపివేస్తున్నారు. అదేవిధంగా, మూడు నెలలపాటు రేషన్ సరుకులు తీసుకోని వారిని కూడా అనర్హులుగా పరిగణిస్తూ, వారి కార్డులను రద్దు చేసే చర్య వేగవంతం చేస్తున్నారు. అందువల్ల, రేషన్ కార్డు దారులు ప్రతి నెలా తప్పనిసరిగా సరుకులు తీసుకోవాలని అధికారులు గుర్తు చేస్తున్నారు.

వివరాలు 

ప్రకాశం జిల్లాలో చివరి దశ స్మార్ట్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు 

ప్రకాశం జిల్లాలోని గణాంకాలను పరిశీలిస్తే, ఇక్కడ మొత్తం 6,61,141 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో కేవలం 5.72 లక్షల కుటుంబాలు మాత్రమే ప్రతి నెల రేషన్ బియ్యం అందుకుంటున్నాయి. అంటే దాదాపు 14 శాతం మంది రేషన్ సరుకులు పొందడం లేదు. ఈ నేపథ్యంలో, ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారికి సంబంధించిన వివరాలను రేషన్ డీలర్లు సేకరించారు. ఆ ఆధారంగా వారి స్మార్ట్ కార్డులను నిలిపివేసారు అని అధికారులు వెల్లడించారు.

వివరాలు 

చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. ప్రకాశం జిల్లాలో ఏర్పాట్లు 

ఇకపై, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త కార్డులు అవసరమయ్యే దరఖాస్తులు, కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు కోసం సుమారు 1.50 లక్షల దరఖాస్తులు జిల్లాలో నమోదయ్యాయి. జులై నెలాఖరు వరకు పరిశీలించిన దాదాపు 17,000 దరఖాస్తులలో 14,296 మంది అర్హులుగా గుర్తించబడి, వారికి స్మార్ట్ కార్డులు మంజూరు చేయబడ్డాయి. ఇప్పటికే సిద్ధమైన కార్డులను మండలాల వారీగా తహసీల్దార్ కార్యాలయాలకు తరలించేశారు. త్వరలో వీటి పంపిణీ ప్రారంభం కానుంది.