NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే
    ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే

    Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 13, 2025
    11:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో ఉన్న 15% జనరల్‌ (స్థానికేతర) కోటా సీట్లను పూర్తిగా రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నారు.

    2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పు అమలులోకి రానుంది. ఇప్పటి వరకు ఈ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు అవకాశముండేది.

    ఇకపై తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఈ కోటాలో అవకాశం ఉండదు.

    ఈ విషయంపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ మూడు జీవోలను సోమవారం విడుదల చేశారు.

    వాటిలో జీవో 20, 21, 22 ద్వారా ప్రవేశాల నిబంధనల్లో స్థానిక, స్థానికేతర నిర్వచనాలను స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

    వివరాలు 

    తెలంగాణలో ముందే అమలు - ఇప్పుడు ఏపీ కూడా 

    తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తమ వర్సిటీలలో 15%స్థానికేతర కోటాలో ఏపీ విద్యార్థులకు అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చింది.

    ఇప్పుడు అదే తరహాలో ఏపీప్రభుత్వం కూడా తెలంగాణవిద్యార్థులకు తమ వర్సిటీలలో అవకాశం లేకుండా నిర్ణయం తీసుకుంది.

    కన్వీనర్‌ కోటాలో స్థానికులకు భారీ కేటాయింపు

    కన్వీనర్‌ కోటాలో ఉన్న 70% సీట్లలో 85% సీట్లు స్థానికులకు కేటాయిస్తారు.ఈ 85% స్థానిక కోటా కింద విద్యార్థుల స్థానికతను రెండు రీజియన్ల ఆధారంగా నిర్ణయిస్తారు..అవి ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)రీజియన్‌, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం(ఎస్వీయూ)రీజియన్‌.

    ఇంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత సీట్లను మూడు రీజియన్ల ఆధారంగా (ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర,ఉస్మానియా) కేటాయిస్తూ వచ్చారు.

    అయితే ఇప్పుడు ఉస్మానియా రీజియన్‌ను తొలగించారు.ఇకపై కేవలం ఆంధ్ర,ఎస్వీయూ రీజియన్‌ల ఆధారంగానే సీట్ల భర్తీ జరుగుతుంది.

    వివరాలు 

    రీజియన్‌లు ఇలా నిర్ణయం 

    ఆంధ్ర (ఏయూ) రీజియన్: శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఈ రీజియన్‌లోకి వస్తాయి. శ్రీవేంకటేశ్వర (ఎస్వీయూ) రీజియన్: అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు ఇందులోకి వస్తాయి.

    రాష్ట్ర విద్యా సంస్థలు

    ఈకొత్త విధానంలో నేరుగా రాష్ట్రానికి చెందిన విద్యా సంస్థలలో:

    శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం

    ద్రవిడ విశ్వవిద్యాలయం

    డాక్టర్ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం

    డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ

    ఆర్జీయూకేటీ

    క్లస్టర్ యూనివర్సిటీ - సిల్వర్ జూబ్లీ కాలేజ్

    వీటిలో 85% స్థానిక కోటా సీట్లను జిల్లా వారీగా కేటాయిస్తారు:అందులో 65.62% సీట్లు ఆంధ్ర రీజియన్‌కు, 34.38% సీట్లు ఎస్వీయూ రీజియన్‌కు కేటాయిస్తారు.మిగిలిన 15% స్థానికేతర కోటా కింద భర్తీ అవుతాయి.

    వివరాలు 

    15% స్థానికేతర కోటాలో అర్హతలేమిటి? 

    ఈ కోటాలో అర్హులుగా పరిగణించే నియమాలు ఇలా ఉన్నాయి: ఆంధ్ర రీజియన్‌ విద్యార్థులు ఎస్వీయూ రీజియన్‌లోని 15% స్థానికేతర సీట్లకు పోటీ చేయవచ్చు;అలాగే ఎస్వీయూ విద్యార్థులు ఆంధ్ర రీజియన్‌లోని 15% సీట్లకు అర్హులు.అభ్యర్థి తల్లిదండ్రుల్లో ఒక్కరు అయినా గత పదేళ్లలో ఏపీలో నివసించి ఉంటే,పిల్లలు ఈ కోటాకు అర్హులు,పితా-మాతలు ఉద్యోగం వల్ల ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా సరే.అభ్యర్థి కనీసం 10 ఏళ్లపాటు ఏపీలో నివసించి ఉండాలి.చదువు ఇతర రాష్ట్రాల్లో సాగినప్పటికీ నివాస నిబంధన సరిపోతే అర్హత ఉంటుంది. ఏపీలో ప్రభుత్వ,కేంద్ర, పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగులు, విశ్వవిద్యాలయాలు, సంస్థల ఉద్యోగుల పిల్లలు - వారు ఎక్కడి వారైనా - ఈ కోటాలో అర్హులు. ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా ఈ కోటాలో అర్హులు.

    వివరాలు 

    స్థానికత ఎలా నిర్ణయిస్తారు? 

    UG కోర్సులలో (B.Tech, B.Pharm, B.Sc తదితర) స్థానికత కోసం విద్యార్థి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వరుసగా నాలుగేళ్లు చదివి ఉండాలి.

    లేదంటే 7 ఏళ్లలో కనీసం నాలుగేళ్లు ఒకే రీజియన్‌లో చదివి ఉండాలి.

    ఈ కాలంలో ఎక్కువ కాలం చదివిన ప్రాంతాన్ని స్థానికంగా పరిగణిస్తారు.

    చదువు సమానంగా రెండు ప్రాంతాల్లో సాగితే, చివరిగా చదివిన ప్రాంతాన్ని స్థానికంగా తీసుకుంటారు.

    ఏ విద్యాసంస్థల్లో కూడా చదవకపోయినా, గత ఏడేళ్లలో ఏపీలో నివాసం ఉంటే, ఎక్కువ కాలం ఉన్న ప్రాంతాన్ని స్థానికంగా పరిగణిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే ఆంధ్రప్రదేశ్
    Operation Sindoor: పలు దేశాల సైనిక రాయబారులకు భారత్‌ స్పెషల్‌ బ్రీఫింగ్‌..! ఆపరేషన్‌ సిందూర్‌
    Monsoon: సాధారణ తేదీ కంటే వారం ముందుగానే నైరుతి రుతుపవనాలు.. నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు! నైరుతి రుతుపవనాలు
    WTC Final: WTC ఫైనల్ కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కామెరూన్ గ్రీన్ తిరిగి జట్టులోకి.. ఆస్ట్రేలియా

    ఆంధ్రప్రదేశ్

    Raj Kasireddy: 'పార్టీ ఫండ్‌ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం'.. సిట్‌ విచారణలో గుట్టు విప్పిన కెసిరెడ్డి భారతదేశం
    Heatwave: నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం.. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత భారతదేశం
    AP SSC Results: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. పది ఫలితాలు విడుదల! భారతదేశం
    AP Liquor Scam: మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే.. రాజ్‌ అనుచరుడు చాణక్య రిమాండ్‌ రిపోర్టులో సంచలనం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025