NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం
    తదుపరి వార్తా కథనం
    AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం
    పదో తరగతి విద్యార్థులకు శుభవార్త

    AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 21, 2024
    09:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు వారి సౌలభ్యాన్ని అనుసరించి పరీక్షలు తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమంలో రాయడానికి అవకాశం కల్పించింది.

    పబ్లిక్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో విద్యార్థులు తమకు నచ్చిన మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

    ఇప్పటికే దరఖాస్తు చేసిన విద్యార్థులు అవసరమైతే తమ ఎంపికను సవరించుకునే అవకాశం కూడా ఉంది.

    గత వైసీపీ ప్రభుత్వం 2020-21 విద్యాసంవత్సరం నుంచి 1-6 తరగతుల విద్యార్థులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చేందుకు ఆదేశాలు జారీ చేసింది.

    అయితే ఆంగ్ల మాధ్యమం అమలుపై సుప్రీంకోర్టు పరిశీలన జరుగుతుండటంతో, "ఒకే మాధ్యమం" అమలు చేయాలని సూచించింది. కానీ, ఆ ప్రస్తావన ఆంగ్ల మాధ్యమానికి మాత్రమే పరిమితమైనట్లు అధికారికంగా నమోదు చేయబడింది.

    వివరాలు 

    తెలుగు మాధ్యమం విద్యార్థులకు పరీక్షల సౌలభ్యం

    దీంతో పదో తరగతి విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన అమలులోకి వచ్చింది.

    కానీ, చాలా పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల బోధన కొనసాగించడంతో, ప్రధానోపాధ్యాయుల అభ్యర్థన మేరకు ఈ ఏడాది మాత్రమే తెలుగు మాధ్యమం విద్యార్థులకు పరీక్షల సౌలభ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి చదువుతున్న 6.20 లక్షల విద్యార్థుల్లో, 4.94 లక్షల మంది వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

    వీరిలో 39 వేల మందికి పైగా తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాయాలని అభ్యర్థించారు.

    గత ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలవుతోందని రికార్డుల్లో పేర్కొన్నప్పటికీ, చాలా పాఠశాలల్లో బోధన మాత్రం తెలుగులోనే కొనసాగింది.

    వివరాలు 

    తెలుగు మాధ్యమం పరీక్షలకు అనుమతి

    తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి ఒక్కసారిగా మార్పు చేయడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు.

    పాఠ్యపుస్తకాలు ద్విభాషా విధానంలో ఉన్నా, బోధన ఎక్కువగా మాతృభాషలోనే జరుగుతుండటంతో విద్యార్థులు తమ పాఠాలు తెలుగులోనే చదివారు.

    ఈ పరిస్థితుల కారణంగా, ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాయడం కష్టసాధ్యమని తేలింది.

    ఈ నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాదికి తెలుగు మాధ్యమం పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్

    ఆంధ్రప్రదేశ్

    AP TET Results: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల .. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి భారతదేశం
    ArcelorMittal: ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిత్తల్‌.. రూ.1,61,198 కోట్లు! బిజినెస్
    AP Mega DSC 2024: రేపే ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్...దరఖాస్తుల స్వీకరణ గడువు ఎప్పటివరకంటే? భారతదేశం
    AP Rains: ఏపీకి పొంచివున్న మరో వాయు'గండం'.. ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025