NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Visakhapatnam: దక్షిణ కోస్తా జోన్‌కు కొత్తగా జోనల్‌ మేనేజర్‌ నియామకం!
    తదుపరి వార్తా కథనం
    Visakhapatnam: దక్షిణ కోస్తా జోన్‌కు కొత్తగా జోనల్‌ మేనేజర్‌ నియామకం!
    దక్షిణ కోస్తా జోన్‌కు కొత్తగా జోనల్‌ మేనేజర్‌ నియామకం!

    Visakhapatnam: దక్షిణ కోస్తా జోన్‌కు కొత్తగా జోనల్‌ మేనేజర్‌ నియామకం!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 08, 2025
    11:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖ ఆధారంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది.

    ఈ జోన్‌ ఆపరేషన్లు త్వరలోనే ఇక్కడ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.వాల్తేరు డివిజన్‌ తూర్పు కోస్తా జోన్‌ నుంచి విడిపోయి,రాయగడను కొత్త డివిజన్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే.

    ఈ డివిజన్‌కు 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ శంకుస్థాపన చేశారు. ఆ తరువాత రైల్వే బోర్డు కొత్త డీఆర్‌ఎంను నియమించింది.

    ఈ పరిస్థితే,దక్షిణ కోస్తా జోన్‌కు జోనల్‌ మేనేజర్‌(జీఎం)నియామకం మీద ప్రచారం జరుగుతోంది.

    తక్షణం కాకపోయినా,అతి త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.

    ప్రధాని మోదీ బుధవారం జోన్‌ ప్రధాన కార్యాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తుండటంతో, రైల్వే బోర్డు దీనిని వేగవంతం చేసినట్లు సమాచారం.

    వివరాలు 

    రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి

    ప్రస్తుతం ఓఎస్డీ ఉన్నప్పటికీ, ప్రధాన కార్యాలయ నిర్మాణం పర్యవేక్షణకు పూర్తి స్థాయి అధికారిని నియమించకపోతే వివక్ష ఉన్నట్లు విమర్శలు వచ్చేవాటికి గమనించి, ఇది ప్రాధాన్యత కలిగిన చర్యగా మారింది.

    రైల్వేకు చెందిన ఖాళీ భవనాలను ఉపయోగించి, జోన్‌ కార్యకలాపాలను త్వరగా ప్రారంభించాలని అన్ని వర్గాలూ అభ్యర్థించడంతో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి వస్తోంది.

    కొత్త జోన్‌ పరిధిలో వాల్తేరు డివిజన్‌తో కూడిన జోన్‌ ఏర్పాటు గురించి స్పష్టత ఉన్నప్పటికీ, అధికారికంగా ఇంకా ప్రకటించబడకపోవడం కొంత అనిశ్చితి ఏర్పడింది.

    వివరాలు 

    రైల్వే లైన్లతో వాల్తేరు డివిజన్‌ను కొనసాగించే అవకాశం

    రాష్ట్ర పరిధిలోని రైల్వే లైన్లతో వాల్తేరు డివిజన్‌ను కొనసాగించే అవకాశం ఉందని పేర్కొనబడింది.ఈ డివిజన్‌ కింద 450 కి.మీ.రూటు,979 కి.మీ. రైల్వే లైన్లు వస్తాయి.

    కొత్తవలస నుంచి అరకు సెక్షన్‌ వరకు 106 కి.మీ. లైను,విజయనగరం నుంచి కూనేరు సెక్షన్‌ వరకు 102 కి.మీ.,బొబ్బిలి-సాలూరు లైను 17 కి.మీ. రైలు లైన్లు ఈ డివిజన్‌ పరిధిలోకి వస్తాయి.

    మిగిలిన భాగం కోల్‌కతా-చెన్నై మార్గంలో ఉండనుంది. మొత్తం 3,496 కి.మీ. రైల్వే రూట్లు, 5,437 కి.మీ. రైల్వే లైన్లు గుంటూరు, గుంతకల్లు, విజయవాడ, వాల్తేరు డివిజన్లతో కలిపి కొత్త జోన్‌ పరిధిలోకి రానున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    విశాఖపట్టణం

    Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్
    Gas Cylinder Leak: విశాఖలో గ్యాస్ లీక్ ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత  ఆంధ్రప్రదేశ్
    Fire Accident : విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న రోగులు అగ్నిప్రమాదం
    Guptha Nidhulu: విశాఖలో లంకే బిందుల కోసం తవ్వకాలు.. నెల రోజుల నుంచి పూజలు! ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025