NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jammu Kashmir: జమ్మూ-కశ్మీర్‌లో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సైన్యం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Jammu Kashmir: జమ్మూ-కశ్మీర్‌లో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సైన్యం 
    జమ్మూ-కశ్మీర్‌లో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సైన్యం

    Jammu Kashmir: జమ్మూ-కశ్మీర్‌లో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సైన్యం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 19, 2025
    10:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లో వాహనాల తనిఖీల సందర్భంగా సైనికులు తనపై దాడి చేశారంటూ ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.

    ఈ ఘటనపై భారత సైన్యం స్పందించి విచారణ ప్రారంభించినట్లు ప్రకటించింది.

    గురువారం రాత్రి రాజౌరీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న లియాఖత్ అలీ, వివాహ కార్యక్రమానికి హాజరై ఇతరులతో కలసి కలకోట్‌కు తిరిగి వెళ్తుండగా, ఆర్మీ సిబ్బంది తనపై దాడి చేశారని ఆరోపించారు.

    ఈ విషయాన్ని ఆయన 'ఎక్స్‌'ద్వారా పంచుకున్నారు.

    వివరాలు 

    తలపై ఆరు కుట్లు 

    నా కుటుంబంలో చాలామంది భారత సైన్యంలో పనిచేశారు.ఈ విషయమై నేను ఎప్పుడూ గర్వించేవాడిని. కానీ ఈ రోజు జరిగిన ఘటన ఆ గౌరవాన్నితగ్గించింది .వాహన తనిఖీల సమయంలో నా గుర్తింపు కార్డును చూపించమని వారు కోరారు. దాన్ని చూపించేందుకు కారు దిగుతున్న నాపై ఆకస్మికంగా వారే దాడి చేశారు. ఆయుధాలతో తలపై బలంగా కొట్టారు. ఈ ఘటనలో నాకు తీవ్ర గాయాలయ్యాయి. వారు క్షమాపణ కూడా చెప్పలేదు. భారత సైన్యం దేశ గర్వకారణం. నాకు న్యాయం జరగాలి"అని అలీ రాసుకొచ్చారు.

    వివరాలు 

    ఇప్పటికే కేసు నమోదు చేసిన భారత సైన్యం

    ఈ నేపథ్యంలో భారత సైన్యం స్పందించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై సమాచారం అందడంతో అక్కడ వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

    వివరాలు 

    తీవ్రంగా స్పందించిన మాజీ ముఖ్యమంత్రి

    ఇక ఈ ఘటనపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి మణిపూర్
    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    జమ్ముకశ్మీర్

    Jammu-Kashmir: ఆర్టికల్ 370పై జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో యుద్ధవాతావరణం  ఆర్టికల్ 370
    Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. అరుపులు, తోపులాటలు..గందరగోళం  భారతదేశం
    Pahalgam: విదేశాల్లో ఉన్న అనుభూతిని కలిగించే పహల్గామ్.. ఇక్కడికి వెళితే వెనక్కి రావాలనిపించదు పర్యాటకం
    Snowfall: జమ్ము కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు వర్షం.. ఎంజాయ్ చేస్తున్న స్థానిక ప్రజలు, పర్యాటకులు.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025