LOADING...
Bihar Elections: అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన.. బీహార్ ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ!
అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన.. బీహార్ ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ!

Bihar Elections: అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన.. బీహార్ ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2025
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్డీయే, ఇండియా కూటముల్లో సీట్ల పంపకంపై చర్చలు సాగుతుండగా, ఒక కొత్త ట్విస్ట్ ఎంఐఎం (మాజ్లిస్‌ ఈ-ఇతిహాద్‌ ఉల-ముస్లిమీన్) చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లోని 243 అసెంబ్లీ సీట్లలో 100 సీట్లకు ఎంఐఎం పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఎంఐఎం శనివారం ప్రకటించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది దాదాపు ఐదు రెట్లు ఎక్కువ సీట్లకు పోటీ చేయాలని భావన. అసదుద్దీన్ ఓవైసీ ప్రకారం, ఎంఐఎం రాష్ట్రంలో "థర్డ్ ఫ్రండ్"గా తన ఉనికిని స్థాపించాలనుకుంటోంది. బీహార్ ఎంఐఎం ప్రెసిడెంట్ అఖ్తరుల్ ఇమాన్ మాట్లాడారు. తాము 100 సీట్లలో పోటీ చేయాలని ప్రణాళికా రూపొందించుకున్నాం.

Details

నవంబర్ 14న ఓట్ల లెక్కింపు

తద్వారా ఎన్డీయే, మహా ఘటబంధన్ (ఆర్జేడీ+ కాంగ్రెస్+ లెఫ్ట్ కూటమి) రెండూ మా ఉనికిని గమనించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మనం లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లతో పొత్తు ఏర్పరిచేందుకు ప్రయత్నించాము. లేఖ కూడా పంపాం, కానీ వారి నుంచి ఇప్పటికీ స్పందన రాలేదన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ముస్లిం ఓటర్ల ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎంఐఎం తన ప్రభావాన్ని చూపగలదని భావిస్తున్నారు. బీహార్ మొత్తం జనాభాలో ముస్లింలు 17% కంటే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా కిషన్ గంజ్, అరారియా, కతిహార్, పూర్నియా వంటి సీమాంచల్ ప్రాంతాల్లో ఎంఐఎం ప్రభావం ఎక్కువగా ఉంటుంది.