NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు
    భారతదేశం

    Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు

    Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 31, 2023, 04:46 pm 0 నిమి చదవండి
    Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు
    అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు

    అత్యాచార కేసులో ఆశారాం బాపునకు గుజరాత్‌లోని గాంధీనగర్ సెషన్స్ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఇప్పటికే ఆశారాం బాపును కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చగా తాజాగా శిక్షను ఖరారు చేసింది. 10 సంవత్సరాల క్రితం అహ్మదాబాద్‌లోని మోటేరాలోని అతని ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశారాం, అతని కుమారుడు నారాయణ్ సాయి తమపై పలుమార్లు అత్యాచారం చేశారని సూరత్‌కు చెందిన ఒక మహిళ ఆమె సోదరి ఆరోపించారు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2013 ఇద్దరు అరెస్టు అయ్యారు. ఈ కేసులో నారాయణ్ సాయికి 2019లో జీవిత ఖైదు పడింది. మంగళవారం తండ్రికి కూడా జీవిత ఖైదు విధించింది కోర్టు.

    కేసు దర్యాప్తు అధికారి దివ్య రవియాకు పలుమార్లు బెదిరింపులు

    2013 నుంచి ఈ కేసు సుదీర్ఘ విచారణ సాగింది. ఈ కేసు విచారణ కోసం 68మంది నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారి దివ్య రవియాకు పలుమార్లు హత్య బెదిరింపులు రావడం గమనార్హం. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులు కాగా, వారిలో ఒకరు అప్రూవర్‌గా మారారు. మిగిలిన ఏడుగురిలో ఆశారాంను తప్ప మిగతా వారందరినీ కోర్టు దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా బాపు తప్ప మిగతా వారందరికి శిక్ష పడంది. ఇందులో ఆశారాం భార్య, కూతురు కూడా ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఆశారాంకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించడంతో అతనిని దోషిగా ప్రకటించింది. 2018 నుంచి ఆశారాం జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    గుజరాత్

    తాజా

    ఈక్వెడార్‌లో 6.8 తీవ్రతతో భూకంపం, 14 మంది మరణం భూకంపం
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం! కర్ణాటక
    మార్చి 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    గుజరాత్

    కిరణ్ పటేల్‌: పీఎంఓ అధికారినంటూ హల్‌చల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు; 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ జమ్ముకశ్మీర్
    దేశంలో పెరుగుతున్న హెచ్‌3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి భారతదేశం
    ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్‌కు అస్వస్థత; చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక నరేంద్ర మోదీ
    గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ ఆటో మొబైల్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023