NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న
    తదుపరి వార్తా కథనం
    అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న
    బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారని ప్రశ్నించిన గువాహటి

    అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న

    వ్రాసిన వారు Stalin
    Feb 15, 2023
    06:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాల్య వివాహాలను అదుపు చేయడంలో అసోం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గువాహటి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో' చట్టాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారని ప్రశ్నించింది.

    పోక్సో చట్టం కింద అభియోగాలు మోపిన తొమ్మిది మందికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులు కస్టడీ విచారణ అవసరమయ్యే కేసులు కాదని కోర్టు తేల్చి చెప్పింది.

    దేశంలో బాల్య వివాహాలు చాలా సంవత్సరాలుగా ముఖ్యమైన సమస్యగా ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, 2019-2020 మధ్య అస్సాంలో 31.8% బాల్య వివాహాలు నమోదయ్యాయి. అస్సాంలో మాతాశిశు మరణాల రేటు అధికంగా ఉండటానికి బాల్య వివాహాలు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.

    హైకోర్టు

    ప్రజల వ్యక్తిగత జీవితంలో విధ్వంసం సృష్టిస్తాయి: హైకోర్టు

    అత్యాచార ఆరోపణలు లేని వారిపై పోక్సో చట్టం ఎందుకని జస్టిస్ శ్యామ్ ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల వ్యక్తిగత జీవితంలో విధ్వంసం కలిగిస్తాయని చెప్పారు. బాల్య వివాహం అనేది చెడు ఆలోచనేనన్నారు. తమ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తామని, అయితే వారిని అరెస్టు చేసి, జైలులో ఉంచాలా? బయటికి పంపాలా? అనేదే ఇక్కడ సమస్య అని జస్టిస్ శ్యామ్ వ్యాఖ్యానించారు.

    బాల్య వివాహాల కేసుల్లో అసోంలో 3,000 మంది జైలు జీవితం గడుపుతున్నారు. వారు తమకు జీవనాధారమని, వాళ్లు జైళ్లలో ఉండటం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నయని మహిళలు నిరసనలకు దిగారు.

    ఫిబ్రవరి 3న, అస్సాం పోలీసులు అధికారికంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అణిచివేతను ప్రారంభించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైకోర్టు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    హైకోర్టు

    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు ఆంధ్రప్రదేశ్
    సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు తెలంగాణ
    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025