NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana Assembly: నేటి నుండి అసెంబ్లీ సెషన్.. చట్ట సవరణలు, ప్రభుత్వ విజయాలపై చర్చ
    తదుపరి వార్తా కథనం
    Telangana Assembly: నేటి నుండి అసెంబ్లీ సెషన్.. చట్ట సవరణలు, ప్రభుత్వ విజయాలపై చర్చ
    నేటి నుండి అసెంబ్లీ సెషన్.. చట్ట సవరణలు, ప్రభుత్వ విజయాలపై చర్చ

    Telangana Assembly: నేటి నుండి అసెంబ్లీ సెషన్.. చట్ట సవరణలు, ప్రభుత్వ విజయాలపై చర్చ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 09, 2024
    09:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

    ఉదయం 10:30 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ సమావేశాల్లో ముఖ్య అంశాలపై చర్చించనున్నారు.

    ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై ప్రకటన చేయనున్నారు.

    ప్రభుత్వం మొత్తం ఏడు చట్ట సవరణ బిల్లులను, రెండు కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది.

    పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) బిల్లు కీలకంగా ఉండనున్నాయి.

    ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురి సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం కల్పించే బిల్లుపై కూడా చర్చ జరగనుంది.

    Details

    తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ విస్తృత ఏర్పాట్లు

    ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు ఆర్డినెన్స్ 2024 వంటి అంశాలు ప్రధానంగా టేబుల్‌పై ఉంచనున్నారు.

    జీహెచ్‌ఎంసీ సవరణ ఆర్డినెన్స్ 2024, పురపాలక సంఘాల సవరణ ఆర్డినెన్స్ 2024, 2022-23 సంవత్సరాలకు సంబంధించిన విద్యుత్, ఆర్థిక సంస్థల వార్షిక నివేదికలను కూడా సభలో ప్రస్తావించనున్నారు.

    మధ్యాహ్నం బీఏసీ సమావేశంలో సెషన్‌ వ్యవధి, కార్యకలాపాలు ఖరారు చేయనున్నారు.

    ఇదిలా ఉండగా, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ వేడుకకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.

    సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.

    Details

    లక్షమందికి పైగా హాజరయ్యే అవకాశం

    ఆవిష్కరణ కార్యక్రమానికి లక్ష మందికిపైగా హాజరు కావచ్చని అంచనా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు.

    ఆకుపచ్చని చీరలో, చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులతో తెలంగాణ రైతు జీవనాన్ని ప్రతిబింబించేలా దీన్ని డిజైన్ చేశారు.

    పిడికిలి రూపంలో పోరాట స్ఫూర్తిని చూపించేందుకు విగ్రహానికి ప్రత్యేక శిల్పకళను అందించారు.

    ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి సాంస్కృతిక ప్రదర్శనలు, అతిథులకు మర్యాదపూర్వక స్వాగత ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    Test Retirement: టెస్ట్ క్రికెట్ అభిమానులకు మరో పెద్ద షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?!  శ్రీలంక
    World Bank, FATF: పాక్‌ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ.. ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఇండియా  పాకిస్థాన్
    Ajit Doval: ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ ముందస్తు డెలివరీల కోసం రష్యాకు వెళ్లనున్న అజిత్‌ దోవల్  అజిత్ దోవల్‌
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ స్టాక్ మార్కెట్

    తెలంగాణ

    TG Farmers: వరి కొయ్యలను తగలబెట్టడం ద్వారా రైతులకు నష్టం: శాస్త్రవేత్తలు భారతదేశం
    Telangana student: పుట్టినరోజు నాడు పేలిన సొంత తుపాకీ..  అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి   హైదరాబాద్
    MLAs disqualification issue: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు భారతదేశం
    Uke Abbayya: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత భద్రాద్రి కొత్తగూడెం

    ప్రభుత్వం

    Vijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలల్లో కూలిపోతుందన్న వార్తలపై విజయశాంతి కౌంటర్  విజయశాంతి
    CM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్  రేవంత్ రెడ్డి
    TS High Court: సింగరేణి ఎన్నికలపై వీడని ఉత్కంఠ.. హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ తెలంగాణ
    Liquor Sales : తెలంగాణలో మద్యం తెగ తాగేస్తున్నారు.. అమ్మకాల్లో అగ్రస్థానం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025