NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Patnam Narender Reddy : కలెక్టర్‌పై దాడి.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు!
    తదుపరి వార్తా కథనం
    Patnam Narender Reddy : కలెక్టర్‌పై దాడి.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు!
    కలెక్టర్‌పై దాడి.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు!

    Patnam Narender Reddy : కలెక్టర్‌పై దాడి.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 13, 2024
    09:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో కొత్త మలుపు తలెత్తింది.

    ఈ ఘటనకు సంబంధించి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆయన్ని అరెస్టు చేశారు.

    లగచర్లలో జరిగిన దాడిలో పట్నం పాత్ర ఉందని అనుమానాలతో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

    ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బోగమోని సురేష్‌ పట్నం నరేందర్ రెడ్డితో పలుమార్లు ఫోన్‌లో సంభాషించినట్లు గుర్తించారు. అందుకే ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.

    Details

    దాడి వెనుక బోగమోని సురేష్ హస్తం

    నవంబర్ 11న వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, ఇతర అధికారుల వాహనాలపై గ్రామస్థులు దాడి జరిపారు.

    ఈ దాడి వెనుక బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు బోగమోని సురేష్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    సురేష్ గ్రామస్తులను ఉసిగొల్పి దాడికి ప్రేరేపించినట్లు తెలిపారు.

    దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

    Details

    16 మంది గ్రామస్తులు అరెస్టు

    దాడి కేసులో ప్రస్తుతం 16 మంది గ్రామస్థులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు, మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.

    సీసీ ఫుటేజీలు పరిశీలించి 34 మంది అనుమానితులను విడుదల చేయగా, 16 మందిని రిమాండ్‌కు తరలించారు.

    ప్రధాన నిందితుడు సురేష్ పరారీలో ఉండటంతో ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని ప్రత్యేక విచారణకు ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీఆర్ఎస్
    కొడంగల్

    తాజా

    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్

    బీఆర్ఎస్

    BRS Symbol Issue: కారు పోలిన గుర్తులపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తెలంగాణ
    Kuna Sriasailam Goud : కూన శ్రీశైలం మీద వివేకానంద దాడి.. పోలీసులకు ఫిర్యాదు  తెలంగాణ
    బీజేపీకి షాక్.. గులాబి గూటికి బిత్తిరి సత్తి, బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి తెలంగాణ
    Kotha Prabhakar Reddy: దుబ్బాక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి తెలంగాణ

    కొడంగల్

    కొడంగల్‌లో రేవంత్ రెడ్డి గెలుపు, పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి ఓటమి  రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025